రీసర్వే త్వరితగతిన పూర్తి చేయండి
నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూ సమస్యల పరిష్కారం, రీసర్వేకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టీకరణ
తొమ్మిది జిల్లాల అధికారులతో సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఈనాడు, విశాఖపట్నం : నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూ సమస్యల పరిష్కారం, రీసర్వేకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. విశాఖలోని ఓ హోటల్లో ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి పరిధిలోని తొమ్మిది జిల్లాల రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2.30 వరకు సాగింది. అధికారులు, సిబ్బందిని మాత్రమే లోనికి అనుమతించారు. ఈ సమావేశంలో రీసర్వేకు సంబంధించిన అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ముందుండాలని, వారి పనితీరుతోనే ప్రభుత్వానికి పేరొస్తుందని మంత్రి సూచించారు. ప్రజలతో హుందాగా వ్యవహరించి తెలియజేసిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని పేర్కొన్నారు. వివిధ సర్వే పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అడిగి తెలుసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ తన అనుభవాలను కలెక్టర్లతో పంచుకున్నారు. సీసీఎల్ఏ కమిషనర్ సాయిప్రసాద్, సర్వే శాఖ ఎండీ సిద్ధార్థజైన్ అధికారుల సందేహాలు నివృత్తి చేశారు.
చట్ట ప్రకారమే సర్వే: రీసర్వేకు సంబంధించి జిల్లాల వారీగా పరిస్థితిని తెలుసుకొని అధికారులకు సూచనలు చేశారు. మంత్రి నేరుగా కొందరు తహసీల్దార్లతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఆయా జిల్లాల్లో ఎన్ని చోట్ల రీసర్వే జరిగింది, ఎక్కడెక్కడ జరుగుతోంది అందులో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎదురైన సమస్యలపై సాంకేతిక బృందం ద్వారా సలహాలు ఇప్పించారు.
* నిబంధనలు, ఆర్వోఆర్ చట్టం ప్రకారం అధికారులు రీసర్వే నిర్వహించాలన్నారు. ఆ పరిధులను ఎవరూ మీరొద్దని చెప్పారు.
* రీసర్వేపై ప్రతి మండలానికి నియమించిన ఉప తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
* వాస్తవ స్థలానికి, దస్త్రాల్లో ఉన్న లెక్కలకు వ్యత్యాసం రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల మధ్య జాయింట్ పట్టాల పంపిణీ సక్రమంగా ఉండేలా చూడాలని, పంపకపు దస్తావేజులను రిజిస్టర్ చేసి ఆ దస్తావేజులతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. గ్రామసభల తరువాత వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
* నగరాలు, పట్టణాల్లో ఉపతహసీల్దార్ల ఆధ్వర్యంలోనే సర్వే జరగాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఒక నంబరు ఇవ్వాలన్నారు. పురపాలక, సర్వేశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరుగుతుందన్నారు.
వాటిపై తాత్సారం ఎందుకు?: 22ఏ జాబితాలో భూసమస్యలను పరిష్కరించడంలో అధికారులు తాత్సారం చేయడంపై మంత్రి గట్టిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా జిల్లాల కలెక్టర్లే వాటిని పరిష్కరించకపోతే ఎలా అని అడిగినట్లు సమాచారం. 22ఏ కింద వచ్చిన దరఖాస్తులలో ప్రాథమిక ఆధారాలు పరిశీలించి, వాస్తవమైతే పరిష్కరించండి. ఆ స్థాయిలో చేయలేకపోతే రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించండి అని తెలియజేసినట్లు తెలిసింది. 22ఏలో ఉన్న వాటికి 1బి, సబ్డివిజన్ వంటి ఇతర పత్రాల ఆధారాలుంటే ఇబ్బంది పెట్టకుండా ప్రజాహితంగా పనులు చేయాలని సూచించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్