logo

పవన్‌కల్యాణ్‌ తెదేపా సీనియర్‌ కార్యకర్త

పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ అధ్యక్షుడు కాదని పరోక్షంగా తెదేపా సీనియర్‌ కార్యకర్త అని రాష్ట్ర ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.

Published : 05 Feb 2023 02:47 IST

మంత్రి అమర్‌నాథ్‌ విమర్శ

మాట్లాడుతున్న మంత్రి అమర్‌నాథ్‌

వేపగుంట, న్యూస్‌టుడే: పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ అధ్యక్షుడు కాదని పరోక్షంగా తెదేపా సీనియర్‌ కార్యకర్త అని రాష్ట్ర ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. విశాఖ నగర పరిధిలోని వేపగుంట దరి వరలక్ష్మీనగర్‌ కొండ ప్రాంతంలో రూ.11.60 కోట్ల నిధులతో నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం భవనం ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాపులకు ఏ ప్రభుత్వం అందించని అభివృద్ధి ఫలాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అందించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలను స్థాపించుకోవచ్చునని అలాంటివాళ్లకు దిశ, ఆశయం, ఆలోచన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా పెట్టిన పార్టీలను వేరొకరికి తాకట్టు పెట్టే విధంగా ఉండకూడదన్నారు. యువగళం పేరుతో చంద్రబాబు సొంతకొడుకు రోడ్డెక్కితే దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌ ఆ పార్టీ జెండాలు మోస్తూ వెట్టిచాకిరీ చేస్తున్నాడని ఆరోపించారు. 175 స్థానాల్లో పోటీ చేయలేని పవన్‌ ముఖ్యమంత్రి ఎలా అవుతారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన వచ్చిన ఓట్ల కంటే నోటా ఓట్లే ఎక్కువగా ఉండటం ఖాయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని