logo

క్రికెటర్‌.. షబ్నమ్‌కు సత్కారం

అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టులో సభ్యురాలిగా ఉన్న విశాఖపట్నానికి చెందిన ఎండీ షబ్నమ్‌(15)ను శనివారం తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) అధికారులు ఘనంగా సత్కరించారు.

Published : 05 Feb 2023 02:47 IST

షబ్నమ్‌కు బహుమతి అందిస్తున్న నేవీ అధికారి

సింధియా, న్యూస్‌టుడే : అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టులో సభ్యురాలిగా ఉన్న విశాఖపట్నానికి చెందిన ఎండీ షబ్నమ్‌(15)ను శనివారం తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) అధికారులు ఘనంగా సత్కరించారు. ఆమె తండ్రి షకీల్‌ ఈఎన్‌సీకి చెందిన ఐఎన్‌ఎస్‌ కళింగలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌గా, తల్లి ఈశ్వరమ్మ నేవీకి చెందిన మెటీరియల్‌ ఆర్గనైజేషన్‌-విశాఖ (ఎంఓవీ)లో ఎల్డీసీగా విధులు నిర్వహిస్తున్నారు. షబ్నమ్‌ సోదరి షెహనాజ్‌ ఆంధ్ర అండర్‌-15 మహిళా క్రికెట్‌ జట్టులో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఎంఓవీ సూపరింటెండెంట్‌, నేవీ అధికారులు, నావికులు, రక్షణ ఉద్యోగులు షబ్నమ్‌ను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని