జీతాలు మహాప్రభో!
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతర ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందగా ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఆంధ్ర వర్సిటీ ఉద్యోగులు, పింఛనర్ల ఇక్కట్లు
రెండు నెలలుగా ఇదే పరిస్థితి
ఈనాడు, విశాఖపట్నం
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతర ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందగా ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మునుపెన్నడూ ఈ విధంగా జరగకపోవడంతో ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు పడతాయా అని ఏ రోజుకు ఆ రోజు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో వర్సిటీకి బడ్జెట్ రాకపోవడంతో ఈ రకమైన దుస్థితి నెలకొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఏటా వేతనాలు, ఇతర అవసరాల కోసం రూ.500 కోట్ల నుంచి రూ.550 కోట్ల బడ్జెట్ అవసరమని విశ్వవిద్యాలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వర్సిటీకి రూ.400 కోట్ల వరకు కేటాయిస్తుంది. ఆ నిధులతో ఎప్పుడూ సరిపెట్టుకొచ్చేవారు. ఈసారి పలు కారణాల వల్ల పూర్తిస్థాయి బడ్జెట్ రానట్లు సమాచారం. దీంతో అదనంగా అవసరమయ్యే నిధుల కోసం వర్సిటీ నుంచి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. సుమారు రూ.150 కోట్ల వరకు అవసరమని పంపించినట్లు తెలిసింది. దీన్ని ఆమోదించి ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసింది. చివరి నిమిషంలో ఫైనాన్స్ విభాగం వద్ద పలు సమస్యల వల్ల నిలిచిపోయినట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇది ఎప్పటికి పరిష్కారమవుతుందో, ఉద్యోగుల ఖాతాల్లోకి ఎప్పుడు నిధులు జమవుతాయో తెలియడం లేదు.
వేల మందికి..
ఏయూ రెగ్యులర్ ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు నెలలుగా జీతాలు లేవు. బోధనేతర సిబ్బందికి ఒక నెల జీతం అందాలి. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్లు గడిచేందుకు కొందరు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జీతం ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోధన సిబ్బందికి వరుసగా రెండు నెలల పాటు అందకపోవడంతో నెలసరి వాయిదాలు, ఈఎంఐల చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్రాంత ఉద్యోగులు వైద్యపరమైన ఖర్చుల కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. వృద్ధాప్యంలో ఉండి పింఛను మీదే ఆధారపడే వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. వర్సిటీలో పింఛనుదారులే అధికంగా ఉండడంతో ఎదురుచూస్తున్నారు.
బకాయిలు ఎప్పుడో?
బోధన సిబ్బంది వేతన సవరణను పింఛను ఉద్యోగులకు అమలు చేయాలి. 1.1.2016 నుంచి 31.3.2019 మధ్య పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు పింఛను సవరణ జరగకపోవడంతో బకాయిలు ఉండిపోయాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఇటీవల విశాఖకు వచ్చిన ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిని విశ్రాంత బోధన సంక్షేమ సంఘ సభ్యులు కలిసి బకాయిలు విడుదల చేయాలని అభ్యర్థించారు.
ప్రస్తుతం బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది 2500 మంది వరకు ఉన్నారు. పింఛను దారులు మాత్రం ఏడు వేల మంది వరకు ఉంటారనేది అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
[ 25-04-2024]
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్