వయా విశాఖ!
మహా విశాఖనగరం గంజాయి అక్రమ రవాణా, మత్తు ఇంజక్షన్లకు కేంద్ర బిందువుగా మారటం ఆందోళన రేపుతోంది. యువత బలహీనతలను అసరాగా చేసుకుని, ఈ తరహా నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు, సరఫరా సాగుతుండటం గమనార్హం.
గంజాయి అక్రమ రవాణా
భారీగా మత్తు ఇంజక్షన్లు దిగుమతి
* 2021లో 2,115 కిలోలు; 2022లో 6,010 కిలోల గంజాయి పట్టుకున్నారు.
* 2021లో 1,500; 2022లో 3,803 నిషేధిత మత్తు ఇంజక్షన్లు, 8,290 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
* 2023 జనవరి నెలలో 209 కిలోల గంజాయి.. 480 ఇంజక్షన్లు, కిలో నల్లమందు పట్టుకున్నారు.
న్యూస్టుడే, ఎంవీపీకాలనీ: మహా విశాఖనగరం గంజాయి అక్రమ రవాణా, మత్తు ఇంజక్షన్లకు కేంద్ర బిందువుగా మారటం ఆందోళన రేపుతోంది. యువత బలహీనతలను అసరాగా చేసుకుని, ఈ తరహా నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు, సరఫరా సాగుతుండటం గమనార్హం. ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు విశాఖ ప్రధాన వేదికగా చేసుకుని ఈ తరహా వ్యాపారాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
* కొరాపుట్ నుంచి గంజాయి: ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో పండే శీలావతి రకం గంజాయికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. గతంలో స్థానికంగా ఉన్న గంజాయి విక్రయదారులు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన గంజాయి వ్యాపారులు నేరుగా నగరానికి వచ్చి ఏజెన్సీకి వెళ్లి.. తమకు పరిచయం ఉన్నవారి నుంచి గంజాయి కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇటీవల విశాఖ ఏజెన్సీతో పాటు.. ఒడిశాలోని కొరాపుట్ నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొరాపుట్ నుంచి విశాఖకు 204 కి.మి. దూరం. దీంతో వ్యాపారులు విశాఖకు వచ్చి.. ఇక్కడే ఉంటూ కొరాపుట్ వెళ్లి అక్కడ బేరసారాలు సాగించి తమ రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాల్లో తరలించేస్తున్నారు.
* కొరాపుట్, విశాఖ ఏజెన్సీల నుంచి విశాఖ వరకు తీసుకువచ్చిన గంజాయిని ఉత్తరప్రదేశ్, బిహార్, తెలంగాణ, మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలతో పాటు కేరళకు సరఫరా చేస్తున్నారు. గత ఏడాది ఇతర రాష్ట్రాలకు చెందిన గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 220 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వారు అనేకమంది ఉన్నారు. ఉమ్మడి విశాఖ ఏజెన్సీ, కొరాపుట్లో కిలో రూ.1500 నుంచి రూ.2000 వరకు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో కిలో రూ.4వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు.
* విశాఖ నగరం ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా మారడమే కాకుండా స్థానికంగా గంజాయిని వినియోగించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. యువత నిర్మానుష్య ప్రాంతాలు, శ్మశానాలు, తీర ప్రాంతాలను మత్తుపదార్థాల స్వీకరణకు వేదికగా మార్చుకుంటున్నారు.
పశ్చిమబెంగాల్ నుంచి దిగుమతి: నిషేధిత మత్తు కలిగించే ఇంజక్షన్లు, మాత్రలు పశ్చిమ బెంగాల్ నుంచి విశాఖకు దిగుమతి అవుతున్నట్లు పోలీసులు, సెబ్ అధికారులు గుర్తించారు. పశ్చిమబెంగాల్కు చెందిన ఒక వ్యక్తి వీటిని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అక్కడ ఒక్కో ఇంజక్షన్ రూ.50కు కొని, నగర పరిధిలో వీటిని రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. గతంలో ఒడిశా నుంచి దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ నుంచి దిగుమతి కావటం విశేషం. వీటిని విక్రయించేవారు నగరంలో సుమారు 10 మంది వరకు ఉండి ఉంటారని భావిస్తున్నారు.
నెంబరు ప్లేట్లను మార్చి: గంజాయి రవాణాకు నిందితులు కొత్త ఎత్తుగడలేస్తున్నారు. తమ రాష్ట్రాలకు చెందిన వాహనాల్లో నగరానికి వచ్చి, ఇక్కడ వాటి నెంబరు ప్లేట్లను మార్చేస్తున్నారు. ప్రత్యేకంగా నెంబరు బోర్డులు తయారు చేయించి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
విశాఖ కుచెందిన రాజేశ్ అనే వ్యక్తి సరఫరా చేసిన రూ. 10 లక్షల విలువైన గంజాయిని హైదరాబాద్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు