వీఎంఆర్డీఏలో పని విభజన!
విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ఇంజినీరింగ్ విభాగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
గందరగోళంగా ఇంజినీరింగ్ విభాగం
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ఇంజినీరింగ్ విభాగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇటీవల వీఎంఆర్డీఏకు అదనంగా ఒక ఎస్ఈ పోస్టు మంజూరు చేసింది. దీంతో ఈ పోస్టుల సంఖ్య రెండుకు చేరింది. ఒక పోస్టులో భవానీశంకర్ ముందునుంచి కొనసాగుతున్నారు. ఈఈ బలరామరాజుకు ఎస్ఈగా పదోన్నతి కల్పించి అదనపు పోస్టు కేటాయించారు. ఎస్ఈలు ఏ బాధ్యతలు నిర్వహించాలి, ఏ విభాగాలపై పర్యవేక్షణ చేపట్టాలో స్పష్టీకరిస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విభాగంలో కొందరిని మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సెంటు ప్లాటు లేఅవుట్లలో ఇప్పటి వరకు పనిచేసిన ఏఈలను మార్చారు.
కొత్త వారికి అక్కడ బాధ్యతలు అప్పగించడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ చర్యల వల్ల హద్దుల నిర్ణయం, ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదే అంశాన్ని సీఈ దృష్టికి పలువురు ఇంజినీర్లు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు ఎస్ఈల సమక్షంలో ఈఈలు, డిప్యూటీ డీఈలు, ఏఈలకు విధులు అప్పగించారు.
* ఎస్ఈ బలరామరాజుకు... బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్, సమీకృత తీర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు, జి-20 సన్నాహక సమావేశాల నేపథ్యంలో కైలాసగిరి మీద చేపడుతున్న పనులు అప్పగించారు. విజయనగరం జిల్లాలోని ఎంఐజీ లేఅవుట్లను పరిశీలించాలి. సబ్బవరం, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ మండలాల్లో ఒక సెంటు ప్లాట్ లే అవుట్లను కూడా పర్యవేక్షించాలి. వీటితో పాటు వీఎంఆర్డీఏకు చెందిన అన్ని కార్యాలయాల నిర్వహణ పనులు, వాణిజ్య దుకాణాలు, ఉద్యానవనాల నిర్వహణ, పర్యవేక్షణ, అన్ని డివిజన్లలో అన్ని రకాల ఎలక్ట్రికల్ పనులు, ఐటీ విభాగాన్ని అప్పగించారు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టుల్లోని నాణ్యత నియంత్రణ బలరామరాజు ఆధ్వర్యంలోనే జరగనుంది.
* ఎస్ఈ భవానీశంకర్... పెందుర్తి, పద్మనాభం మండలాల్లో అన్ని రకాల పనులతో పాటు ఒక సెంటు ప్లాట్ల లేఅవుట్ల అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి. భీమిలి మండంలో చేపడుతున్న పనులు, విజయనగరంలో జరుగుతున్నవి చూడాలి. ఎంపీ నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు, జాతీయ చారిత్రక సందర్శనాలయ ప్రాజెక్టు పనులు ఈయనకు అప్పగించారు. వీటితో పాటు అనకాపల్లి, ఆనందపురంలో ఒక సెంటు ప్లాట్ లేఅవుట్లు చూసుకోవాలి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ కింద చేపడుతున్న ఎంఐజీ లేఅవుట్ల పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
మిగిలిన ఉద్యోగులకు ఎప్పుడో?: వీఎంఆర్డీఏలో పలువురు ఉద్యోగులు పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్నారు. కొందరికి డిపార్టుమెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్ఈ పోస్టుకు మాత్రం వీఎంఆర్డీఏలోనే డీపీసీ సమావేశం నిర్వహించి పదోన్నతి కల్పించారు. మిగిలిన ఉద్యోగుల విషయంలో మాత్రం స్పందించడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
-
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.