అంగన్వాడీ కార్యకర్తల పోరుబాట
అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు పి.మణి డిమాండ్ చేశారు.
ఆందోళనలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు
కార్పొరేషన్, న్యూస్టుడే: అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు పి.మణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. రూ.26 వేల వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయానికి రావద్దని అర్ధరాత్రి నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.దేవి మాట్లాడుతూ అంగన్వాడీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన చరవాణులు పనిచేయడం లేదన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ గత మూడ్నెళ్లుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అనంతరం అర్బన్-2 సీడీపీఓ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్లో మ్యాచ్లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్పై ఇంత వ్యామోహమా!..సెల్ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..