ఏకగ్రీవ నిధులకు ఎదురుచూపులు
ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందే పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
4.65 కోట్లిచ్చి వెనక్కి తీసుకున్న సర్కారు
ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందే పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి స్పందించి జిల్లాలో 75 పంచాయతీలు ముందుకొచ్చాయి. వీటికి జనాభా లెక్కన రూ.5 లక్షల, రూ.10 లక్షలు చొప్పున రూ.4.65 కోట్ల నజరానా ఇవ్వాల్సి ఉంది. పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువు తీరి రెండేళ్లు కావొస్తున్నా సర్కారు ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులను మాత్రం విడుదల చేయలేదు.
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే, కోటవురట్ల: ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు అదనంగా ప్రభుత్వమిచ్చే ప్రోత్సాహక మొత్తం అందుబాటులోకి వస్తే మిగతా గ్రామాల కంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చని సర్పంచులు ఆశపడ్డారు. ఏడాది క్రితం ఓసారి ఏకగ్రీవ నిధులు మంజూరు చేసినట్లే చేసి మరలా వెనక్కి తీసుకున్నారు. ఆర్థిక సంఘం నిధులు పరిస్థితి అంతే..సాధారణ నిధులున్నా ఖర్చుపెట్టడానికి ఆంక్షలు పెడుతుండడంతో ఏకగ్రీవ పంచాయతీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
నదిలో దిగి పొలానికికి వెళ్తున్న నారాయణరాజుపేట గ్రామస్థులు
నాడు అలా.. నేడు ఇలా..
మాకవరపాలెం మండలంలో నారాయణరాజుపేట పంచాయతీని తెదేపా హయాంలో ఏకగ్రీవం చేసుకున్నారు. నాటి ప్రభుత్వం ప్రోత్సహక నిధులుగా రూ.7 లక్షలు ఇచ్చింది. అపుడు మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు గ్రామాభివృద్ధి కోసం మరికొన్ని పథకాల నుంచి సుమారు రూ.2 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఆ గ్రామంలో చాలావరకు అభివృద్ధి పనులు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తే సర్పానదిపై వంతెన నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారి వైకాపా సర్కారు వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని పీలా వరలక్ష్మిని ఏకగ్రీవంగా గెలిపిస్తే సర్పా నదిపై వంతెన తామే నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్ హామీ ఇచ్చారు. దీంతో వరలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు జరిగిన రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులు రాలేదు.. వంతెన మాట మరుగున పడిపోయిందని గ్రామస్థులు అంటున్నారు.
మిగతా పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. నిధులు వస్తే గ్రామాల్లో ఏదోక అభివృద్ధి పనులు చేద్దామని నిరీక్షిస్తున్నారు.. ఈ విషయమై డీపీవో శిరీషారాణి వద్ద ప్రస్తావించగా ఏకగ్రీవ నిధులు ఇంకా రాలేదని, త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంతకుముందు మంజూరై వెనక్కి వెళ్లినట్లు సమాచారం లేదన్నారు.
నిధుల్లేక ఇబ్బందులు..
ప్రోత్సాహక సొమ్ము వస్తుందని చూస్తున్నాం. ఇంతవరకు పైసా వేయలేదు. గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దీని నివారణకు ప్రధాన మురుగు కాలువపై పలకలు వేయాలి. దీంతో పాటు వీధి రోడ్లు నిర్మాణం, కుళాయిలు వేయించాలి. గ్రామం చిన్నది కావడంతో నిధులరాక అంతంతమాత్రంగా ఉంది. అధికారులను అడుగుతుంటే అందరితోపాటే వస్తాయి అంటున్నారు తప్పితే, ఎప్పుడనేది చెప్పడంలేదు.
ఫాతిమున్నీసా బేగం, సర్పంచి పెదబోదిగల్లం
శ్మశానం, రోడ్లు బాగుచేయాలి
ప్రజలంతా కలిసి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక సొమ్ముకోసం ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్నాం. వీటితో గ్రామంలో 500 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం, శ్మశానంలో నీటి సదుపాయం కల్పించి షెడ్లు కట్టాలని చూస్తున్నాం. నిధుల్వికపోవడంతో ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు.
గోసల నర్సమ్మ, సర్పంచి, బంగారమ్మపేట
పైసా కూడా రాలేదు..
ఏకగ్రీవం సొమ్ముల కోసం రెండేళ్ల నుంచి చూస్తున్నాం. ఆ నిధులు వస్తే గ్రామంలో మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టాలని అనుకున్నాం. ఇప్పటి వరకు పైసా నిధులు రాలేదు. ఆర్థిక సంఘం నిధులు కూడా అందుబాటులో లేవు. మాతో పాటు పాములవాక, రామన్నపాలెం, బోడపాలెం పంచాయతీలు కూడా మా మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైనవే. ఏ పంచాయతీకి ఈ నిధులు రాలేదు. వాటి కోసమే ఎదురుచూస్తున్నాం.
కన్నôరెడ్డి వరహాలుబాబు, సర్పంచి నీలిగుంట, కోటవురట్ల మండలం
పెదబోదిగల్లంలో పలకలు వేయాల్సిన మురుగు కాలువ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!