logo

వైద్య కళాశాల నిర్మాణ పనులకు శ్రీకారం

భీమబోయినపాలెం సమీపంలో రూ. 500 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాల కాంక్రీట్‌ పనులను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ బుధవారం ప్రారంభించారు.

Published : 09 Feb 2023 04:27 IST

పూజలు చేస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌

మాకవరపాలెం, న్యూస్‌టుడే: భీమబోయినపాలెం సమీపంలో రూ. 500 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాల కాంక్రీట్‌ పనులను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ బుధవారం ప్రారంభించారు. వైద్య కళాశాల పూర్తై విద్యా, వైద్య సేవలు అందుబాటులోకి వస్తే అనకాపల్లి జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లా, రాష్ట్రాలకు సంబంధించిన ఎంతో మందికి ఇక్కడ సేవలందుతాయన్నారు. రెండేళ్లలో వైద్య కళాశాల పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఎప్పటికప్పుడు పనులను తనిఖీ చేయడంతో పాటు నిబంధనలు, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, మండల వైకాపా అధ్యక్షులు రుత్తల శ్రీనివాసు, ఎంపీటీసీ సభ్యుడు సర్వేశ్వరరావు, ప్రాజెక్టు మేనేజర్‌ రామకృష్ణారెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని