logo

శక్తి కేంద్రాలను బలోపేతం చేయండి

బూత్‌స్థాయిలో ఉన్న శక్తి కేంద్రాలను బలోపేతం చేయాలని భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పిలుపునిచ్చారు.

Published : 09 Feb 2023 04:27 IST

మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: బూత్‌స్థాయిలో ఉన్న శక్తి కేంద్రాలను బలోపేతం చేయాలని భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పిలుపునిచ్చారు. అచ్యుతాపురంలో నియోజకవర్గ కన్వీనర్‌ రాజాన సన్యాసినాయుడు అధ్యక్షతన నియోజకవర్గస్థాయి ముఖ్య భాజపా నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు.  ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పీవీఎన్‌.మాధవ్‌ పోటీలో ఉంటారని తెలిపారు. ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేసి మాధవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి భాజపా బలాన్ని రాజకీయపార్టీలకు తెలియజేయాలన్నారు. కిసాన్‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంతిన భక్తసాయిరాం, భాజపా నాయకులు వేగి నాయుడు, రవిరాజు, రాజాన రాజు, విశ్వనాథం, మేరుగు కాసుబాబు, వెంకటేశ్వర్లు, పిట్టా దాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని