‘ప్రచార పర్వం’లో..కిరికిరి
మీరు విశాఖలోని కొన్ని రోడ్లపై వెళ్తుంటే... భారీ ప్రచార స్తంభాలపై ఉన్న తెరలపై ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకూ రోడ్ల పక్కన...ఉద్యానవనాల్లో వాటిని తిలకించిన మీరు..ఇకపై నడి రోడ్డుపైనే చూడొచ్చు.
అనుకున్న వారికే ‘ఎల్ఈడీ హోర్డింగ్స్’ లీజు
వేగంగా కదులుతున్న దస్త్రాలు
ఈనాడు, విశాఖపట్నం: మీరు విశాఖలోని కొన్ని రోడ్లపై వెళ్తుంటే... భారీ ప్రచార స్తంభాలపై ఉన్న తెరలపై ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకూ రోడ్ల పక్కన...
ఉద్యానవనాల్లో వాటిని తిలకించిన మీరు..ఇకపై నడి రోడ్డుపైనే చూడొచ్చు. వాటిని చూస్తూ వెళితే... ప్రమాదాలు జరగొచ్చు కదా.. అని మీకు అనుమానమొచ్చిందా? ఎవరికైనా ఇలాగే వస్తుంది.
కానీ, జీవీఎంసీలోని కొందరు అధికారులకు ఇవేమీ అక్కర్లేదు. తమకు కావాల్సిన వారికి ఈ కాంట్రాక్ట్ అప్పగించేయాలంతే... అన్నట్లు దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. మరో విచిత్రమేమంటే... ఆవ్యవహారాలన్నీ టెండరు విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో అప్పగించేందుకు ప్రయత్నిస్తుండటం.
ఇలాంటి హోర్డింగులపైనే సరికొత్తగా ప్రకటనలు ప్రదర్శిస్తారు.
నగరంలో పలు చోట్ల వాణిజ్య ప్రకటనలు, ఆహ్వానాలు, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే భారీ హోర్డింగులను చూస్తుంటాం. నగర పరిధిలోని రోడ్లు, కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో అలాంటివి ఏర్పాటుకు జీవీఎంసీ కొన్ని ఏజెన్సీలకు లీజు ప్రాతిపదికన అనుమతి ఇస్తుంది. ఇందుకు టెండర్లను ఆహ్వానిస్తారు. ఇప్పటి వరకు ఈ విధానమే కొనసాగుతోంది. కొత్తగా ఎల్ఈడీతో కూడిన భారీ హోర్డింగులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. వీటి మీద (మూవింగ్ యాడ్స్) కదిలే ప్రకటనలను ప్రసారం చేస్తారు. నగరంలోని అనేక చోట్ల వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకు కీలకమైన 150 ప్రాంతాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. రోడ్ల మధ్యలో ఇలాంటి ఏర్పాటు రాష్ట్రంలో ఇక్కడే మొదటిసారని సమాచారం.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
నగర పరిధిలోని ఎల్ఈడీ హోర్డింగుల బాధ్యత అప్పగింతకు టెండర్లు పిలవాలి. అలా కాకుండా ఓ ప్రముఖ ఏజెన్సీకి చెందిన రెండు సంస్థలకే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని చూస్తున్నారు. వీటికి పోటీ ఉన్నప్పటికీ ఇలా చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. టెండరు ద్వారా పిలిస్తే జీవీఎంసీకి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. అలా చేయకుండా నచ్చిన ధరకు అప్పగిస్తే భారీ మొత్తంలో రెవెన్యూకు గండి పడే అవకాశాలున్నాయి.
* ఇదంతా ఓ కీలక అధికారి కనుసన్నల్లోనే జరుగు తుండటం గమనార్హం. సదరు ఏజెన్సీకు లబ్ధి చేకూర్చే క్రమంలో అందుకు అనుగుణంగా దస్త్రాన్ని సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇటువంటి అంశాల్లో లీజు, ధర నిర్ణయించే అధికారం నేరుగా ఆ కీలక అధికారికి లేదు. స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్లో పెట్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం గుర్తించిన కొందరు నేతలు అడ్డుకున్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఆ అధికారి దీన్ని ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిబంధనలకు విరుద్ధమైనా..
ఎల్ఈడీ హోర్డింగులను రోడ్డు మధ్య, కూడళ్ల వద్ద ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇందులో నిమిషానికి ఒకసారి ప్రసారాలు మారుతుంటాయి. ఇవి వాహనదారుల చూపును మళ్లిస్తాయి. రహదారుల భద్రత చట్టం ప్రకారం ఏర్పాటు చేయకూడదని పలువురు పేర్కొంటున్నారు. అయినప్పటికీ నగరంలోని నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు, ప్రాంతాల్లో ఏర్పాటుకు ఆలోచిస్తున్నారు. దాదాపు 20 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో ఈ హోర్డింగులు ఉంటాయి. భారీ స్తంభాల మీద అందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా