అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి
భారతీయ క్రీడగా ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన టార్గెట్ బాల్లో మనదేశ యువత అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఆకాంక్షించారు.
టార్గెట్బాల్ పోటీలను ప్రారంభిస్తున్న గీతం అధ్యక్షుడు శ్రీభరత్
సాగర్నగర్, న్యూస్టుడే: భారతీయ క్రీడగా ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన టార్గెట్ బాల్లో మనదేశ యువత అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఆకాంక్షించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) ఆధ్వర్యంలో గీతం డీమ్డ్ వర్సిటీ వేదికగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల విభాగం టార్గెట్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. జట్టుగా విజయం కోసం కృషి చేయడం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా యువత జీవితంలో అవరోధాల్ని సైతం అధిగమించొచ్చన్నారు. టార్గెట్ బాల్ వంటి నూతన క్రీడల ద్వారా త్వరితంగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించగలదన్నారు.
* భారతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సోనూ శర్మ మాట్లాడుతూ హ్యాండ్బాల్, బాస్కెట్బాల్ క్రీడల్ని కలిపి భారతీయ క్రీడగా 2012 సంవత్సరంలో టార్గెట్ బాల్ను మధుర (ఉత్తరప్రదేశ్)లో ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) 2017 నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో ఈ క్రీడను ప్రోత్సహిస్తోందన్నారు.
* గీతం క్రీడా విభాగం కార్యదర్శి అరుణ్కార్తిక్ మాట్లాడుతూ గీతంలో జరుగుతున్న ఈ పోటీలకు దేశంలోని 29 విశ్వవిద్యాలయాల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఏపీ నుంచి గీతం, ఏయూ, నాగార్జున, కేఎల్యూ వర్సిటీలతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ జట్లు పాల్గొన్నాయన్నారు.
* గీతం ప్రొ-వీసీ ఆచార్య వై.గౌతమ్రావు, రిజిస్ట్రార్ ఆచార్య డి.గుణశేఖరన్, క్రీడా విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా మాట్లాడారు. అనంతరం క్రీడా పతాకాలను ఎగురవేసి క్రీడా ప్రతిజ్ఞ చేశారు.
మొదటి రోజు ఫలితాలు: తొలిరోజు జరిగిన నాకౌట్ పోటీల్లో జననాయక్ చంద్రశేఖర్ యూనివర్సిటీ (లక్నో) జట్టుపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు విజయం సాధించగా... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ జట్టు (విశాఖ)పై జీఎల్ఏ వర్సిటీ (యూపీ) జట్టు విజయాన్ని దక్కించుకుంది. మరో పోటీలో బీఎస్ అబ్దుల్ రెహమాన్ క్రీసెంట్ ఇన్స్టిట్యూట్(చెన్నై) జట్టుపై జననాయక్ చంద్రశేఖర్ యూనివర్సిటీ జట్టు గెలుపొందగా గుజరాత్ విద్యాపీఠ్ జట్టుపై జీఎల్ఏ వర్సిటీ జట్టు విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు