సంచుల నిండా... వెండి బిస్కెట్లు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల ప్రచారం ముగింపు దశలో వెలుగులోకి వచ్చిన వీడియోలు సంచలనం రేపాయి. వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కార్యాలయంగా పేర్కొంటున్న ఫ్లాట్లో భారీగా వెండి బిస్కెట్లు (ఒక్కొక్కటి 15 గ్రాములు) సంచుల్లో నింపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట కలకలం
అవి వైకాపా అభ్యర్థివేనని.. తెదేపా, పీడీఎఫ్ నేతల ఆందోళన
వెండి బిస్కెట్లు ఉన్న సంచులు
ఎంవీపీ కాలనీ, పెదవాల్తేరు, న్యూస్టుడే: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల ప్రచారం ముగింపు దశలో వెలుగులోకి వచ్చిన వీడియోలు సంచలనం రేపాయి. వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కార్యాలయంగా పేర్కొంటున్న ఫ్లాట్లో భారీగా వెండి బిస్కెట్లు (ఒక్కొక్కటి 15 గ్రాములు) సంచుల్లో నింపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీంతో పీడీఎఫ్, తెదేపా నేతలు అప్రమత్తమయ్యారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు సైతం చర్చనీయాంశమయ్యాయి. అధికారులు తక్షణం స్పందించలేదని, పోలీసులు బందోబస్తుగా ఉన్న సమయంలోనే వాహనాల్లో వెండి బిస్కెట్లు బయటకు తరలించేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా, పీడీఎఫ్ నేతలు నినాదాలు చేశారు.
బందోబస్తుకు వచ్చిన పోలీసులు
ఎంత జాప్యమో: ఎన్నికల సమయంలో ఏమైనా పట్టుబడితే వెంటనే పోలీసులు, తనిఖీ సిబ్బంది వాటిని గుర్తించి ఎంత స్వాధీనం చేసుకున్నారో వెల్లడిస్తారు. ఇక్కడ మాత్రం దాదాపు ఐదు గంటల వరకూ అలా చేయకపోవడం గమనార్హం. తనిఖీకి వచ్చిన ఎమ్మార్వో, పోలీసులు కనీసం లోనికి వెళ్లలేదు. అదే సమయంలో కొందరిని మాత్రం లోపలికి పంపించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న వెండి బిస్కెట్లను వాహనాల్లో అక్కడి నుంచి తరలించటానికి వీలు కల్పించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ఒక్కో బిస్కెట్పై 15 గ్రాములు అని రాసుంది. వివిధ ఆకృతులు కూడా ఉన్నాయి. పలు సంచులలో ఇవి ఉన్నట్లు తెలుస్తోంది. కోడ్ ఉల్లంఘించి ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోలేదు’ అని సీపీఎం నేతలు ఆరోపించారు. గతంలో ప్రచారంలో పాల్గొన్న ఏయూ వీసీపై ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, ఇప్పుడు వెండి బిస్కెట్ల పంపిణీకి సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమాచారం తెలిసి కలెక్టర్కు ఫోన్లో ఫిర్యాదు చేయగా, లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పేర్కొన్నారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని అందించేందుకు నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో, మూడో పట్టణ పోలీసుల సమక్షంలో పరిశీలించిన తనిఖీ బృందం..సదరు కార్యాలయంలో ప్రచార సామగ్రి మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది.
కొందరికే అనుమతి: దిశా ఏసీపీ వివేకానంద, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ కోరాడ రామారావు, మరో ముగ్గురు ఎస్.ఐ.లు అపార్టుమెంట్ గేటు వద్దే ఉండి లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో కొందరు వైకాపా నాయకులు, కార్పొరేటర్లను మాత్రమే లోపలికి పంపించడం గమనార్హం. తరువాత కొద్దిసేపటికి లోపల ఉన్న కొందరు బయటకు వెళ్లిపోవడంపై పలువురు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడంపై విమర్శిస్తున్నారు. అపార్టుమెంట్ ఎదురుగా కూడా ఎవరూ ఉండొద్దని పీడీఎఫ్, తెదేపా నేతలను పంపించేయడం గమనార్హం.
వెండి బిస్కెట్ల వీడియోలను చూపుతున్న కార్పొరేటర్ గంగారాం
ఓటర్లను ప్రలోభపెట్టే యత్నం: ‘వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఓటర్లకు వెండి బిస్కెట్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఆర్కేబీచ్ దరి మెజిస్టిక్ టవర్లోని ఆయన కార్యాలయమైన ప్లాట్ నెంబరు 101 ఫ్లాట్లో వాటిని ఉంచారు. దీనిపై పీడీఎఫ్ బృందం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, ఎన్నికల పరిశీలకులకు, పోలీసు కమిషనర్కు సాయంత్రం 5.30 గంటలకు ఫిర్యాదు చేసింది. మహారాణిపేట తహసిల్దార్ రాత్రి 7.30 గంటలకు పోలీసులతో సహా వచ్చి కనీసం ఫ్లాట్లోకి వెళ్లకుండా అపార్టుమెంట్ గేటు ముందే ఉండిపోయారు’ అని కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?