Polavaram: పోలవరం కంకరకు కాళ్లు!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలవరం కుడికాలువకు ఇరువైపులా కంకర, మట్టి తవ్వి తరలించుకుపోవడంపై హైకోర్టు ఇటీవల సీరియస్ అయింది. సంబంధిత శాఖ అధికారులందరికీ నోటీసులు జారీచేసింది.
కాలువ పొడవునా అక్రమ తవ్వకాలే
అధికార పార్టీ నేతలే సూత్రధారులు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే, ఎలమంచిలి/గ్రామీణం, ఎస్.రాయవరం
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలవరం కుడికాలువకు ఇరువైపులా కంకర, మట్టి తవ్వి తరలించుకుపోవడంపై హైకోర్టు ఇటీవల సీరియస్ అయింది. సంబంధిత శాఖ అధికారులందరికీ నోటీసులు జారీచేసింది. అక్రమ మైనింగ్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. కుడి కాలువే కాదు.. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఎడమ కాలువ పరిస్థితి అలానే ఉంది. పాయకరావుపేట నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు ఉన్న పోలవరం ఎడమ కాలువకు ఇరువైపులా అక్రమంగా రాళ్లు, కంకర, మట్టి తరలించుకుపోతున్నారు.
ఒకప్పుడు కొండలను తలపించేలా ఉన్న కంకర గుట్టలన్నీ కరిగిపోతున్నాయి. స్థానిక అధికార పార్టీ నేతలకు ఈ కాలువ గట్లు కాసులు కురిపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారుల కళ్లెదుటే కంకర కరిగిపోతున్నా.. రాళ్లు తరిగిపోతున్నా అధికార పార్టీ నాయకులతో మనకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు.
పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, రోడ్డు పక్కన స్థలాలు ఎత్తు చేయడానికి పోలవరం కాలువ గట్టు నుంచే ఎక్కువగా కంకర తరలిస్తున్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నలుగురు నాయకులు ఇదే వ్యాపారంగా మార్చుకున్నారు. రాత్రయితే చాలు ట్రాక్టర్లతో కంకరను అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. అడ్డురోడ్డు నుంచి తాళ్లపాలెం వరకు ఇటీవల రోడ్డు పక్కన చాలా నిర్మాణాలు జరిగాయి. రోడ్డుకు సమాంతరంగా కంకరతో నింపి ఎత్తుచేయడానికి వీరు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనికోసం నాలుగైదు లక్షలకు బేరం పెట్టుకుని చదును చేస్తున్నారు. పురుషోత్తపురం, మర్రిబంద, కొక్కిరాపల్లి, నర్సింగబిల్లి సమీపాల్లో ఇలా కంకరతో రోడ్డు పక్కనే స్థలాల ఎత్తు చేస్తున్నా ఇటు మైనింగ్, అటు పోలవరం అధికారులు పట్టించుకోలేదు.
ఆరు నెలల్లో పట్టుకుంది నాలుగు ట్రాక్టర్లే
నిబంధనల ప్రకారం పోలవరం కాలువ పక్కనున్న కంకర తీసుకోవాలంటే గనుల శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. క్యూబిక్ మీటర్ను బట్టి సీనరేజి చెల్లించాలి. ఏ ప్రాంతంలో తీసుకుంటారు.. ఎన్ని క్యూబిక్ మీటర్లు అన్నది మైనింగ్ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అధికారుల పర్యవేక్షణలో తరలించాలి. అయితే ఇవేవీ జరగడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండానే కంకర పట్టుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వచ్చి రెండు ట్రాక్టర్లు పట్టుకోవడం తర్వాత వదిలేయడం పరిపాటిగా మారింది. రోజూ వందలాది ట్రాక్టర్లతో కంకర, రాళ్లు తరలిపోతున్నా గత ఆరు నెలల్లో ఎలమంచిలి సర్కిల్ పరిధిలో కేవలం నాలుగు కంకర ట్రాక్టర్లు మాత్రమే పట్టుకున్నామని చెప్పడం విశేషం..
ఎస్.రాయవరం మండల దార్లపూడి సమీపంలో కరిగిపోతున్న గుట్ట
ఏటికొప్పాక, మన్యంపాలెం, ములకలాపల్లి, ఎస్.రాయవరం మండలం దార్లపూడి నుంచి రోజూ కంకరను తరలిస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రి వేళల్లో పొక్లెయిన్ పెట్టి మరీ తవ్వేస్తున్నారు. పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లే ఉంటున్నారు. దీంతో అక్రమ వ్యాపారం మూడు పవ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది.
తవ్వకాలను అడ్డుకుంటాం...
- ఉమేష్కుమార్, ఇన్ఛార్జి ఈఈ, పోలవరం ప్రాజెక్టు, ఎలమంచిలి
పోలవరం కాలువ పక్కనున్న కంకర అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత శాఖలకు సమాచారం ఇస్తున్నాం. మేం కూడా కొన్ని వాహనాలను పట్టుకున్నాం. ప్రస్తుతం హెటిరో డ్రగ్స్ కంపెనీ మాత్రమే కంకర తీసుకోవడానికి అనుమతి తీసుకుంది. ఎలమంచిలిలో ఒక పరిశ్రమ ఐదువేల క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకుంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఎవరికీ తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.