ఎందుకిలా?
సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్గా భావించింది అధికార వైకాపా. అయితే ఓటమి చవిచూడటం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంతో వైకాపా నేతల దిగ్భ్రాంతి
మూడు రాజధానుల ఆలోచనను స్వాగతించని పట్టభద్రులు
ఈనాడు-విశాఖపట్నం: సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్గా భావించింది అధికార వైకాపా. అయితే ఓటమి చవిచూడటం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో కొందరు మంత్రులకు స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పట్టభద్రుల ఎన్నికల ఫలితాల సరళితో ఆ పార్టీ ఉత్తరాంధ్రలో పట్టు సాధించడం కష్టమని పలువురు చెబుతున్నారు. ప్రజల్లో, పట్టభద్రుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతం ఈ ఫలితాలతో స్పష్టమైంది. మూడు రాజధానులు.. పరిపాలనా రాజధానిగా విశాఖ అంటూ హడావుడి చేసినా ఓటర్లు స్వాగతించలేదు. అధికారం అడ్డుపెట్టి ఒత్తిళ్లు, ప్రలోభాలు పెట్టినా వైకాపాకు ఓటమి తప్పలేదు. నేతల భూకబ్జాలు, విపక్ష నాయకులపై కక్ష పూరిత వేధింపులు వంటివి ఓటమికి కారణాలుగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఫలించని వ్యూహాలు: వైకాపా తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, ముత్యాలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు రంగంలోకి దిగినా ఓటమి తప్పలేదు. వైకాపాకు అనుకూలంగా ఉన్న అధికారులకు పదోన్నతులు, కోరుకున్న చోటుకు బదిలీలు చేస్తామనే హామీలు ఇచ్చారనే ప్రచారం సాగింది. అలాగే వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న అధికారుల జాబితా సిద్ధం చేస్తే ఎన్నికల తర్వాత దూర ప్రాంతాలకు బదిలీ చేస్తామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పలు చోట్ల ప్రచారంలో వాలంటీర్లూ పాల్గొన్నారు. ఓటుకు నోటు, వెండి బిస్కెట్ల పంపిణీ వంటి ప్రలోభాలు భారీగా జరిగాయి. కొన్ని చోట్ల ఎన్నికల నియమావళి ఉల్లంఘించి మరీ నేతలు అడుగులు వేశారు. విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని, త్వరలోనే నగరానికి మకాం మారుస్తున్నానంటూ స్వయాన ముఖ్యమంత్రి ఇటీవల పెట్టుబడుల సదస్సులోనూ చెప్పారు. ఈ అంశంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపాకు మొగ్గు చూపుతారని భావించినా అంతా తలకిందులైంది. ఉత్తరాంధ్ర వైకాపాలో కొందరు నేతల మధ్య విభేదాలు, వర్గపోరు ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది. ‘విజయసాయిరెడ్డి వ్యక్తిగా ముద్ర వేసుకున్న ఏయూ వీసీ, మాజీ రిజిస్ట్రార్లు వైవీ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు’ అంటూ ఎన్నిక ముగిసిన తర్వాత పలువురు నేతలు తెరవెనుక వ్యాఖ్యానిస్తున్నారు.
భూకబ్జాలు, అక్రమాలపై వ్యతిరేకత: ప్రభుత్వ పాలనాతీరుతో పాటు వైకాపా నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలు, అక్రమాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రుషికొండను ఇష్టానుసారం తవ్వేయడంపైనా నగరవాసుల్లో అసంతృప్తి ఉంది. అనుమతుల్లేకుండా భారీ స్థాయిలో పలు చోట్ల నిర్మాణాలు సాగిస్తున్న అంశం విశాఖలో నిత్యం చర్చనీయాంశమవుతోంది. పలువురు మంత్రుల తీరుపై ఇప్పటికే ఎన్నో విమర్శలొచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. వీటన్నింటిపై ప్రజలు స్పష్టతతో ఉన్నారని, రానున్న సాధారణ ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ ఫలితాలే వైకాపాకు పునరావృతమవుతాయని ప్రతిపక్షాల నేతలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి