గొప్ప ‘క్షణాలవి..’ దేశ ప్రధానిని కలుసుకోవటం మా అదృష్టం
‘దిల్లీకి వెళ్లడం.. స్వయంగా దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం మా జీవితంలో మరచిపోలేని గొప్ప క్షణాలవి’ అంటున్నారు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ విద్యార్థులు.
అధ్యయన యాత్ర అనుభవాలు పంచుకున్న విద్యార్థులు
న్యూస్టుడే, ఎంవీపీకాలనీ
దేశ ప్రధాని నరేంద్రమోదీతో వసతిగృహ విద్యార్థులు
‘దిల్లీకి వెళ్లడం.. స్వయంగా దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం మా జీవితంలో మరచిపోలేని గొప్ప క్షణాలవి’ అంటున్నారు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ విద్యార్థులు. ‘విద్య, ఆర్థిక అక్షరాస్యత’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన 14 మంది సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ విద్యార్థులు దిల్లీ అధ్యయనయాత్రకు వెళ్లారు. జేడీ డి.వి.రమణమూర్తి పర్యవేక్షణలో ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులను ఈ యాత్రకు ఎంపిక చేశారు.ఇండియన్ బ్యాంకు సహకారం అందించింది. దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ముచ్చటించిన వీరు తిరుగు ప్రయాణమయ్యారు. అధ్యయన యాత్రలో అనుభవాలను ‘న్యూస్టుడే’ పంచుకున్నారు.
అధ్యయన యాత్రలో పాల్గొన్న విద్యార్థులు
యోగ సాధన గురించి ప్రధానికి వివరించాం
- ఎస్.కార్తీక భవానీ, 9వ తరగతి, పెందుర్తి వసతిగృహం
అధ్యయన యాత్రకు వెళ్లే అవకాశం దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను. దిల్లీలో కర్తవ్యపథ్, ఇండియాగేటు, ప్రధాని కార్యాలయం, నోయిడా మింట్ ఫ్యాక్టరీ సందర్శించాం. పార్లమెంట్ భవనంలో దేశ ప్రధాని మోదీని కలిసే అదృష్టం దక్కింది. మా వసతిగృహంలో మేము చేసే యోగ సాధన గురించి ప్రధానికి తెలియజేయగా మమ్మల్ని అభినందించారు. ప్రతీ ఆదివారం స్వచ్ఛభారత్ పాటించాలన్నారు. ఇది జీవితంలో మరచిపోలేని సంఘటన.
వినోదం.. విజ్ఞానం పొందాను
- లావణ్య, పెందుర్తి వసతిగృహం
దిల్లీలో ప్రధానిని కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యాత్ర వల్ల విజ్ఞానం.. వినోదం రెండూ లభించాయి. ఇండియాగేట్, నేషనల్ మ్యూజియం వంటి ప్రాంతాలను సందర్శించాం. ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం. పుస్తకాల్లో చదవటం కన్నా, ప్రత్యక్షంగా చూడటం వల్ల అనేక అంశాలపై అవగాహన కలిగింది.
నాణేల తయారీ గురించి తెలుసుకున్నాం..
- పి.సింధు, వసతిగృహ విద్యార్థిని
విజ్ఞాన యాత్రలో భాగంగా నోయిడాలోని మింట్ ఫ్యాక్టరీ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. వాస్తవానికి ఈ ఫ్యాక్టరీ గురించి ముందు నాకు అసలు అవగాహన లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ ద్వారా వివిధ రకాల నాణేలను భారత ప్రభుత్వం ముద్రిస్తుందని తెలుసుకున్నాం. దీని గురించి మా స్నేహితులకు తెలియజేస్తాను.
పార్లమెంట్ భవనంపై అవగాహన వచ్చింది
- పి.ఆదిత్య, భీమిలి వసతిగృహం
నేను దిల్లీ వెళ్తానని ఎప్పుడూ ఊహించలేదు. ప్రధానిని ప్రత్యక్షంగా కలవటం మరచిపోలేని అనుభూతి. దిల్లీలో పార్లమెంట్ భవనం సందర్శించి, లోక్సభ జరిగే తీరును తెలుసుకున్నాను. పబ్లిక్ గ్యాలరీలో 5 నిమిషాల పాటు కూర్చునే అవకాశం దక్కింది. ఇండియాగేట్ను ప్రత్యక్షంగా చూశాం. మా అధ్యయన యాత్ర గురించి విపులంగా రాసి అందరికి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తాను.
ఇలాంటి అధ్యయన యాత్రలు అవసరం
- మహేంద్ర, వసతిగృహ విద్యార్థి
విద్యార్థి దశలోనే ఈ తరహా అధ్యయన యాత్రలు చాలా అవసరం. యాత్ర వల్ల వినోదమే కాకుండా ఎంతో విజ్ఞానం వచ్చింది. చాలా వరకు సందర్శనీయ ప్రాంతాల గురించి వినటం, పుస్తకాల్లో చదవటం జరుగుతుంది. ఇప్పుడు స్వయంగా తెలుసుకున్నాం. దేశ ప్రధాని మాతో ముచ్చటించటం మా అదృష్టమనే చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చిన సాంఘిక సంక్షేమశాఖ జేడీ రమణమూర్తి, బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు చెప్పాలి.
లోక్సభ సందర్శించాం..
- సుమతి, ఆనందపురం
సంయుక్త సంచాలకులు రమణమూర్తి ఆదేశాలతో అధ్యయన యాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలియని అనేక విషయాలను తెలుసుకునే అవకాశం దక్కింది. ఇన్ని ప్రాంతాలను ఒకేసారి చూడటం అనేది మాకు సాధ్యం కాని విషయమే. పార్లమెంట్ భవనం సందర్శించిన సమయంలో లోక్సభ ఎలా జరుగుతుంది? అధికార, ప్రతిపక్ష నాయకులు ఎక్కడెక్కడ కూర్చుంటారు.. స్పీకర్ గది ఇలా .. అన్నింటి గురించి విపులంగా తెలియజేశారు. ఒక విధంగా ఇది పూర్తిస్థాయి విజ్ఞానమనే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)