మూడు సమోసాలు రూ.70.. 300 గ్రాముల పెరుగన్నం రూ.90
ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వన్డే మ్యాచ్ సందర్భంగా చేసిన కొన్ని ఏర్పాట్లు క్రికెట్ అభిమానులకు పరీక్షగా నిలిచాయి. వాటిపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధిక ధరలపై అభిమానుల ఆగ్రహం
చాలా చోట్ల తాగునీరు అందక అవస్థ
ఈనాడు, విశాఖపట్నం
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కుర్చీలు
ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వన్డే మ్యాచ్ సందర్భంగా చేసిన కొన్ని ఏర్పాట్లు క్రికెట్ అభిమానులకు పరీక్షగా నిలిచాయి. వాటిపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కుర్చీలు సరిగా లేకపోవడం, తాగునీరు అందకపోవడం, ఆహార పదార్థాలపై అధిక ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు 2023-25 కాలానికి ఎన్నికైన కొత్త కార్యవర్గం ఈ మ్యాచ్ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా... కొన్ని సౌకర్యాల విషయంలో ప్రేక్షకులకు ఇబ్బందులు తప్పలేదు.
అమ్మో ఇంతా?..
కొన్ని స్టాండ్లలో తాగునీటికి ఏర్పాట్లు చేసినా అవెక్కడో తెలియక ప్రేక్షకులు అవస్థలు పడ్డారు. మైదానంలోకి బయట నుంచి నీళ్ల సీసాలను అనుమతించకపోవడంతో పిల్లలతో వచ్చిన వారికి ఇబ్బందులు తప్పలేదు. లోపల నీళ్ల సీసాల కన్నా శీతల పానీయాలే అధికంగా అమ్మడంతో వాటిని తప్పక కొనుగోలు చేయాల్సి వచ్చిందని వీక్షకులు పేర్కొన్నారు. స్టేడియం లోపల ఆహార పదార్థాలను అధిక ధరకు విక్రయించడంపైనా విమర్శలు వచ్చాయి. మూడు సమోసాలు రూ.70లకు, 300 గ్రాముల పెరుగన్నం రూ.90లకు, 130 గ్రాముల పకోడి రూ.70లకు, 300 గ్రాముల ఎగ్ బిరియానీ రూ.120లకు విక్రయించారు. శీతల పానీయాలను రెట్టింపు ధరలకు విక్రయించడంతో బెంబేలెత్తిపోయారు. సినిమా థియేటర్లలో రూ.40 విక్రయించే పానీయాలనుఇక్కడ రూ.60కి అమ్మారు. చిప్స్ ప్యాకెట్లను ఎంఆర్పీ ధర కన్నా రెండింతలకు విక్రయించారని కొందరు తెలిపారు. పలు స్టాండ్లలో కుర్చీలు అధ్వానంగా ఉన్నాయి. సౌత్ ఈస్టు లోవర్ స్టాండులో శాశ్వత కుర్చీలు లేని చోట తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అవీ సరిగా లేవనే విమర్శలు వచ్చాయి.
టోపీలు ఇస్తామని..
వేసవి కావడంతో ఎండ వేడిమి తట్టుకునేలా టోపీలు ఇచ్చే ఏర్పాటు చేయాలని కలెక్టరు మల్లికార్జున సూచించారు. అందుకు ఏసీఏ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికీ టోపీలు ఇవ్వాలని నిర్ణయించింది. దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే వాతావరణం చల్లబడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. నిర్వాహకుల్లో కొందరు తమకు తెలిసిన వారికి ఉన్నత శ్రేణి పాసులు, గుర్తింపు కార్డులు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు జిల్లా అధికారులకు కూడా సాధారణ పాసులు ఇచ్చారు. ఓ ఉన్నతాధికారి కుటుంబాన్ని సౌత్ బ్లాక్లో కూర్చోబెట్టగా మధ్యలోనే వెళ్లిపోయారు. ఏసీఏలో పనిచేసే కొందరు తమకు తెలిసిన వ్యక్తులకు ఇష్టానుసారంగా గుర్తింపుకార్డులు ఇచ్చుకున్నారని పలువురు విమర్శించారు.
రూ.600 టికెట్ రూ.6 వేలు..
‘బ్లాక్’లో టికెట్లను యథేచ్ఛగా విక్రయించారు. ఆదివారం ఉదయం నుంచి మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు వీటి విక్రయాలు స్టేడియం బయట కొనసాగడం గమనార్హం. కొందరు రూ.600 టికెట్లను రూ.6 వేలకు కూడా అమ్మారు. రూ.3500 టికెట్ల రూ.8 వేల వరకు విక్రయించడం గమనార్హం. పలువురి వద్ద ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఉండడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పరుగులు పెట్టించిన డీసీపీ..
స్టాండ్స్లోకి వచ్చిన డీసీపీ సుమిత్ సునీల్ గరుడ
మ్యాచ్ జరుగుతుండగా కొందరు పోలీసులు మ్యాచ్ వీక్షించేందుకు స్టాండ్స్లోకి వచ్చారు. దీన్ని గుర్తించిన డీసీపీ సుమిత్ సునీల్ గరుడ స్టాండ్స్లోకి వచ్చి మ్యాచ్ను వీక్షిస్తున్న పోలీసులను పరుగులు పెట్టించారు. పహారా కాయకుండా మ్యాచ్ చూడడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడున్న పోలీసులు స్టాండ్స్లో పరుగులు పెట్టడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందోనని వీక్షకులు ఆందోళన చెందారు. ఆ తరువాత అక్కడున్న పోలీసులు వారికి అప్పగించిన విధుల్లో నిమగ్నమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా