గుంత పూడదు.. గండం తప్పదు
రహదారులపై గోతులు కనిపించకూడదు. వర్షాలు తగ్గిన వెంటనే గుంతలన్నీ పూడ్చేయాలి. వాటి ఫొటోలు తీసి నాడు, నేడు రూపంలోసచివాలయాల దగ్గర ప్రదర్శించాలి
పూడ్చేందుకు ససేమిరా అంటున్న గుత్తేదారులు
మూడేళ్లుగా టెండర్లు, ఒప్పందాలతోనే కుస్తీలు
ఈనాడు డిజిటల్, పాడేరు
ఎస్.రాయవరం మండలంలోని పెద ఉప్పలం రోడ్డు
రహదారులపై గోతులు కనిపించకూడదు. వర్షాలు తగ్గిన వెంటనే గుంతలన్నీ పూడ్చేయాలి. వాటి ఫొటోలు తీసి నాడు, నేడు రూపంలో సచివాలయాల దగ్గర ప్రదర్శించాలి
నాలుగేళ్లలో గ్రామాల్లోని రోడ్ల పరిస్థితిలో పెద్దగా మార్పులు కనిపించలేదు. గోతులతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
...రోడ్ల మరమ్మతులపై సమీక్షించినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలివి...
ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్శాఖ పరిధిలో గ్రామీణ రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ. 71.71 కోట్లతో అంచనాలు తయారు చేయడం. 20 ప్యాకేజీలుగా టెండర్లు పిలవడం అన్నీ జరిగిపోయాయి. అందులో ఏజెన్సీలో పనులకే బిడ్లు వేశారు. వాటిలో ఒకటి రెండు పనులు చేసి బిల్లులందక మిగతావాటిని అసంపూర్తిగా వదిలేశారు. బిడ్లు దాఖలు చేసినవారు కూడా ఒప్పందాలకు వెనుకంజ వేశారు. ఇక మైదాన ప్రాంతంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు కొంత చొరవ తీసుకుని తమ నియోజకవర్గంలో రోడ్లను మెరుగుపర్చుకున్నారు.. మిగతా నియోజకవర్గాల్లో చిన్న గోతులు కాస్తా క్రమేపీ పెద్దపెద్ద గొయ్యిలుగా మారిపోయాయి. వీటిని పూడ్చి రహదారిపై ప్రయాణం సాఫీగా సాగేలా మరమ్మతులు చేయడానికి పలుమార్లు టెండర్లు పిలుస్తున్నా గుత్తేదారుల నుంచి అసలు స్పందనే లేదు.
నిధుల్లేకుండా పనులంటే ఎట్టా..
గ్రామీణ ప్రాంతాల్లో లింకురోడ్ల అభివృద్ధి పేరుతో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) నిధులతో రహదారుల మరమ్మతులు చేపట్టాలనుకున్నారు. ఆ నిధులు అందుబాటులోకి రాకపోవడంతో బ్యాంకు నుంచి రుణం తీసుకుని పనులు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇంతవరకు ఆ రుణంపైనా స్పష్టత లేకుండా పోయింది. మరమ్మతులకు ఏ నిధులు ఖర్చు చేస్తుందో చెప్పకుండా టెండర్లు పిలిస్తే ఎవరొస్తారని ఆ శాఖలోని ఇంజినీరింగ్ అధికారులే అంటున్నారు. గుత్తేదారులను వ్యక్తిగతంగా పిలిచి బిల్లులకు మేం హామీ ఇస్తున్నాం... పనులు చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నా ససేమిరా అంటున్నారు.
ఈ రోడ్ల దుస్థితి మారేదెన్నడో?
పాయకరావుపేట నియోజకవర్గంలో 23 కి.మీ మేర ఎనిమిది రోడ్లపై గోతులను పూడ్చేందుకు రూ. 4.24 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. గుంటపల్లి - ఒడ్డిమెట్ట రోడ్డు, గోపాలపట్నం నుంచి నక్కపల్లి మండలం గునిపూడి, జాతీయ రహదారి నుంచి సీతారాంపురం, కొత్తూరు - సత్యవరం, కోటవురట్ల మండలంలోని ఎండపల్లి నుంచి వేములపూడి, నక్కపల్లి మండలంలో ఉపమాక నుంచి జానకయ్యపేట, ఎస్.రాయవరం మండలంలోని పెద ఉప్పలం రోడ్లకు కొత్తరూపు తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరు కాకపోవడంతో మూడేళ్లయినా వీటి దుస్థితిలో మార్పు రాలేదు.
* చోడవరం నియోజకవర్గంలో చోడవరం నుంచి చాకిపల్లి మీదుగా వెళ్లే 9.8 కి.మీ., బి-ఎన్ రహదారి నుంచి రాయపురాజు పేటకు వయా అంభేరుపురం మీదుగా వెళ్లే రహదారి, చోడవరం నుంచి అంకుపాలెం రోడ్డు, బి-ఎన్ రహదారి నుంచి లక్ష్మీపురం వెళ్లే దారి, గంటికొర్లాం మార్గాలను అభివృద్ధి చేయాలనుకున్నారు. గతంలో రెండు దఫాలు టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ మూడోసారి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
గోతులతో అధ్వానంగా నునపర్తి-వాడచీపురుపల్లి రోడ్డు
గ్రాంట్ ఇంకా రాలేదు.. : రోడ్లపై గోతులు పూడ్చేందుకు అవసరమైన గ్రాంట్ ఇంకా రాలేదు. అప్పట్లో ఏజెన్సీలో కొన్ని పనులు మొదలుపెట్టినా నిధులు లేక తాత్కాలికంగా వాటిని నిలిపారు. మాడుగుల నియోజకవర్గంలో మూడు రోడ్లు బాగుచేశారు. నిధులు అందుబాటులోకి వస్తే మిగతా పనులన్నింటికీ మళ్లీ టెండర్ పిలవడానికి అవకాశం ఉంటుంది.
కె.శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!