logo

Vizag: సేవ్‌ ఏపీ ఫ్రం వైఎస్‌ఆర్‌సీపీ: వైజాగ్‌ మ్యాచ్‌లో ప్లకార్డు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ‘సేవ్‌ ఏపీ... ఫ్రం వైఎస్‌ఆర్‌సీపీ’  అనే ప్లకార్డును ప్రదర్శించడం చర్చనీయాంశమయింది.

Updated : 21 Mar 2023 08:01 IST

క్రికెట్‌ స్టేడియంలో ప్లకార్డు ప్రదర్శించిన యువకుడు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ‘సేవ్‌ ఏపీ... ఫ్రం వైఎస్‌ఆర్‌సీపీ’  అనే ప్లకార్డును ప్రదర్శించడం చర్చనీయాంశమయింది. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ యువకుడు ఈ ప్లకార్డు ప్రదర్శిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కొందరు వీటిని షేర్‌ చేస్తున్నారు. మరికొందరు వాట్సప్‌ల స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు. వేలాది మంది ప్రేక్షకుల మధ్యలో ఈ తరహా ప్లకార్డు ప్రదర్శన కలకలం రేపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని