logo

‘తూర్పుకాపులకు రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ వర్తింపజేయాలి’

తూర్పు కాపులకు ఉత్తరాంధ్రలోనే ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని.. వారికి రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ ఎంపీ జి.వి.ఎల్‌. నరసింహారావుతో కలిసి కాపు నాయకులు దిల్లీలో సోమవారం జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ హన్స్‌రాజ్‌ గంగారామ్‌కు వినతిపత్రం అందజేశారు.

Published : 21 Mar 2023 03:28 IST

బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ హన్స్‌రాజ్‌ గంగారామ్‌కు వినతిపత్రం ఇస్తున్న కాపు నాయకులు, చిత్రంలో ఎంపీ జీవీఎల్‌

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: తూర్పు కాపులకు ఉత్తరాంధ్రలోనే ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని.. వారికి రాష్ట్రవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ ఎంపీ జి.వి.ఎల్‌. నరసింహారావుతో కలిసి కాపు నాయకులు దిల్లీలో సోమవారం జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ హన్స్‌రాజ్‌ గంగారామ్‌కు వినతిపత్రం అందజేశారు. ఎంపీ జీవీఎల్‌ చొరవ పట్ల తూర్పు కాపు నాయకులకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గొర్లె శ్రీనివాసనాయుడు, సరిపిడికల రామారావు, కరణంరెడ్డి నరసింగారావులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని