logo

విశాఖ పోర్టులో కస్టమ్స్‌ దాడులు

విశాఖ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు దాడులు జరిపి అనుమతులు లేకుండా ఎగుమతులు చేస్తున్న రూ. 5.5 కోట్ల విలువ చేసే 46 మెట్రిక్‌ టన్నుల ఆరిక గింజలను స్వాధీనం చేసుకున్నారు.

Published : 21 Mar 2023 03:28 IST

ఎంవీపీకాలనీ, న్యూస్‌టుడే: విశాఖ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు దాడులు జరిపి అనుమతులు లేకుండా ఎగుమతులు చేస్తున్న రూ. 5.5 కోట్ల విలువ చేసే 46 మెట్రిక్‌ టన్నుల ఆరిక గింజలను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా మొత్తం 56 మెట్రిక్‌ టన్నుల సరకులు ఎగుమతి అవుతున్నట్లుగా గుర్తించారు. వీటిలో 46 మెట్రిక్‌ టన్నుల ఆరిక గింజలుకాగా మిగిలినవి ఎండు ఖర్జూరంగా గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని