logo

వైకాపా పతనం ప్రారంభం : బుద్ద

ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.

Published : 24 Mar 2023 05:37 IST

బాణసంచా కాల్చుతున్న పీలా

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. కార్యాలయం ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలే భరించలేకపోతున్నారని ఆరోపించారు. జిల్లాలోని చక్కెర కర్మాగారాలు తెరిపించేవరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కోట్ని రామకృష్ణ, కుప్పిల జగన్‌, బొడి వెంకటరావు, సూరే సతీష్‌, పొలిమేర నాయుడు పాల్గొన్నారు.
బీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్థానిక ప్రధాన రహదారిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. స్వయంగా బాణసంచా కాల్చి కార్యకర్తలకు మిఠాయిలు తినిపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను ప్రజలే కాదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు మళ్ల సురేంద్ర, కొణతాల రత్నకుమారి, బి.ఎస్‌.ఎం.కె.జోగినాయుడు, పోలారాపు త్రినాథ్‌, సబ్బవరపు గణేష్‌, ఆళ్ల రామచంద్రరావు, తలారి లక్ష్మి ప్రసాద్‌, సంకర్ల పద్మలత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు