logo

నగరంలో సినీతారల క్రికెట్‌ సందడి

సినీతారల సెలబ్రిటీ క్రికెట్‌ పోటీలు విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో శుక్ర, శనివారాల్లో జరగనున్నాయి.

Published : 24 Mar 2023 05:46 IST

నేడు సెమీస్‌.. రేపు ఫైనల్స్‌

సాధనలో సినీ నటుడు అఖిల్‌

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే : సినీతారల సెలబ్రిటీ క్రికెట్‌ పోటీలు విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో శుక్ర, శనివారాల్లో జరగనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరిగే తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై హీరోస్‌, భోజ్‌పూరి దబాంగ్స్‌ జట్లు, రాత్రి 7.00 గంటల నుంచి 11.00 గంటల జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌ జట్లు తలపడనున్నాయి. విజేత జట్లు శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 11.00 గంటల వరకు జరిగే ఫైనల్స్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ సందర్భంగా సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ వ్యవస్థాపకులు, ఎండీ ఇందూరి విష్ణువర్ధన్‌ ఆధ్వర్యంలో తెలుగు వారియర్స్‌ జట్టు సెమీఫైనల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలుగు వారియర్స్‌కు వాసవీ గ్రూపు ప్రైమరీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు నటులు విశాఖకు చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని