వ్యర్థం.. అగ్నికి ఆజ్యం
ఏటా వేసవిలో నగరంలో అగ్నిప్రమాదాలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ జరిగేవి కొన్నయితే, నిర్లక్ష్యంతో చోటుచేసుకునేవి కొన్ని.
డంపింగ్యార్డుల్లో పేరుకుపోతున్న చెత్త
కార్పొరేషన్, న్యూస్టుడే
ముడసర్లోవ కేంద్రంలో వ్యర్థాల నుంచి విడుదలవుతున్న మీథేన్ వాయువు
ఏటా వేసవిలో నగరంలో అగ్నిప్రమాదాలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ జరిగేవి కొన్నయితే, నిర్లక్ష్యంతో చోటుచేసుకునేవి కొన్ని. ముఖ్యంగా చెత్తను నిల్వ చేసే డంపింగ్ యార్డుల్లో అగ్నికీలలు రేగుతున్నాయి. దీనికి నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నా..మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
* విశాఖ నగర శివారు కాపులుప్పాడ డంపింగ్యార్డులో ఇప్పటికే రెండు లక్షల టన్నుల చెత్త పోగుపడి ఉంటుందని అంచనా. ఇందులో ఉన్న ప్లాస్లిక్ వ్యర్థాల నుంచి మీథేన్ వాయువు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. దీనికి అధిక ఉష్టోగ్రతలు తోడైతే అగ్నిప్రమాదాలకు ఆస్కారముంటుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం డంపింగ్యార్డు నుంచి వచ్చే దుర్వాసన, విషవాయువులతో మారికవలస దరి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లి పోతున్నారు.
కంటి తుడుపు చర్యలు
కాపులుప్పాడ డంపింగ్యార్డులో వ్యర్థాల నిర్వహణకు రూ.8 కోట్లతో సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాజెక్టు చేపట్టారు. దాదాపు 120 ఎకరాలకుపైగా ఉన్న ఈ యార్డులో కేవలం నాలుగు ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తడి చెత్త నుంచి వర్మీకంపోస్టు తయారు చేసే పరిశ్రమ, గ్యాస్ ఉత్పత్తి కర్మాగారం, భవన నిర్మాణ వ్యర్థాల నుంచి టైల్స్, ఇతర నిర్మాణ సామగ్రి తయారు చేసే పరిశ్రమలు ఇక్కడున్నాయి. అయితే అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఫలితంగా వ్యర్థాలు ఎప్పటికప్పుడు పేరుకుపోతూ కొండలా మారుతోంది.
ఏటా రూ.12.6 కోట్ల వ్యయం
* నగరంలో 578 క్లాప్ వాహనాలతో ఇళ్ల నుంచి చెత్తను సేకరించి, దాన్ని వార్డుల్లో ఉన్న నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ్నుంచి తిరిగి కాపులుప్పాడ డంపింగ్యార్డుకు తీసుకెళుతున్నారు. నెలకు ఒక్కో క్లాప్ వాహనానికి రూ.65వేల చొప్పున నెలకు రూ.3.75 కోట్లు ఏడాదికి రూ.45.08 కోట్లు చెల్లిస్తున్నారు. ఒక్కో నిల్వ కేంద్రం నుంచి కాపులుప్పాడ డంపింగ్యార్డుకు చెత్తను తరలించడానికి రూ.1.80 కోట్ల వ్యయం చేస్తున్నారు. ఏడు నిల్వ కేంద్రాల కోసం రూ.12.6 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
* నిబంధనల మేరకు క్లాప్ వాహనాలు తెచ్చే చెత్తను నిల్వ కేంద్రాల నుంచి తరలించి స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. కాని అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కవుతూ వందల టన్నుల చెత్త నిల్వ అయ్యేంత వరకు వేచి ఉంటున్నారు. దాన్ని తరలించడానికి మరోసారి టెండర్లు పిలిచి అదనపు నిధులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఇటీవల గాజువాక, తాటిచెట్లపాలెం చెత్త నిల్వ కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు జరిగి పారిశుద్ధ్య వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించడం, నిల్వ కేంద్రాల్లో టన్ను చెత్త కూడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా అగ్నిప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నగరంలో చెత్త నిల్వ కేంద్రాలు
* ముడసర్లోవ
* పాతనగరం
* తాటిచెట్లపాలెం
* చీమలాపల్లి
* గాజువాక
* అనకాపల్లి
* భీమిలి
* నగరంలో రోజుకు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు: 1100 మెట్రిక్ టన్నులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ