logo

బాలికపై మేనమామ అత్యాచారం

స్వయాన మేనకోడలిపై మేనమామే అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆదివారం రాత్రి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.

Published : 27 Mar 2023 03:55 IST

గాజువాక, న్యూస్‌టుడే : స్వయాన మేనకోడలిపై మేనమామే అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆదివారం రాత్రి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ వివరాలు... కాకినాడ జిల్లా పిఠాపురం సమీప గ్రామానికి చెందిన బాలిక(13) తన మేనమామ కుటుంబాలతో కలిసి పెదగంట్యాడ వచ్చి, అద్దె గృహాల్లో నివాసం ఉంటున్నారు. బాలిక తల్లి ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లగా, తండ్రి వేరుగా నివాసం ఉంటున్నారు. దీంతో బాలిక తన చిన్న మేనమామ(28)  ఇంట్లో ఉంటోంది. ఆయన భార్య వారం రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. దీంతో శనివారం రాత్రి బాలికకు మాయమాటలు చెప్పి, తన ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లిన చిన్న మేనమామ అత్యాచారానికి పాల్పడి, ఆదివారం ఉదయం ఇంటి వద్ద విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయాడు. బాలికను గమనించిన పెద్ద మేనమామలు... ఏం జరిగిందని ఆరా తీయడంతో విషయం బయటపడింది. వెంటనే వారు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం ఇంటికొచ్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న్యూపోర్టు సీఐ రాము ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని