మెదడు మధించి.. మదిని గెలిచి!
రేపటి పౌరులుగా ఎదుగుతున్న నేటి పిల్లల్లో మనస్తత్వం అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని 139 పాఠశాలల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.
రాష్ట్రస్థాయికి రెండు నమూనాల ఎంపిక
- నర్సీపట్నం గ్రామీణం, న్యూస్టుడే
రేపటి పౌరులుగా ఎదుగుతున్న నేటి పిల్లల్లో మనస్తత్వం అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని 139 పాఠశాలల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.
పిల్లల భవిష్యత్తుకు ఊతమిచ్చేలా రూపుదిద్దుకున్న 403 ప్రాజెక్టులు ఈ నెల 20న అనకాపల్లిలో ప్రదర్శనకు ఉంచగా.. వాటిలో పది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.
...వీటిలో నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, పాయకరావుపేట హైస్కూళ్ల నమూనాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. 215 మంది గైడ్ టీచర్ల మార్గదర్శకంలో 13,151 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈ నమూనాల తయారీలో భాగస్వామమయ్యారు.
రాష్ట్రస్థాయి ప్రదర్శన ఈ నెల 28న విజయవాడలో జరగనుంది.
ఎంపికైన ప్రాజెక్టులు ఇలా..
నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు నీలం గీతిక, కలిమి బుజ్జి, నవర జస్వంత్ పారిశుద్ధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకుని ‘ఆరోగ్య రాయబారి కవచం’ తయారు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు సాధారణంగా దుర్గంధభరితమైన పరిసరాల్లో పనిచేస్తుంటారు. దుర్గంధం భరించేందుకు కొందరు గుట్కా, ఖైనీ, మద్యానికి అలవాటు పడుతుంటారు. సురక్షితంగా ఉండేందుకు ఎన్-95 మాస్క్ వాడాలంటే మార్కెట్లో రూ.60 నుంచి రూ.150 వరకు ఖర్చు చేయాలి. ఇంత మొత్తాన్ని వెచ్చించే పరిస్థితి వీరికి లేనందున సాధారణ మాస్కులకే క్రిములను ఎదుర్కొనే వేపనూనె, సువాసన ఇచ్చే నిమ్మగడ్డి ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోనే రక్షణ పొందవచ్చంటూ నమూనా తయారు చేశారు. గైడ్ టీచర్గా ఏవీ రాజగోపాల్ వ్యవహరించారు. కేవలం రూ.48 ఖర్చుతో వంద మి.లీ. ద్రావణాన్ని వీరు తయారు చేసి వినియోగించారు. దీన్ని అనేక మాస్క్లపై పిచికారీ చేసుకోవచ్చు.
పాయకరావుపేట విద్యార్థులను అభినందిస్తున్న అధికారులు
వాహన చోదకులను నిద్రమత్తు నుంచి అప్రమత్తం చేయడానికి వీలుగా ‘అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్’ పేరిట పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.దుర్గాప్రసాద్, కె.దుర్గాస్వామి సాధారణ కళ్లద్దాలను ఆధునికీకరించారు. గైడ్ టీచర్గా ఎ.దొరబాబు వ్యవహరించారు. 2021లో దేశంలో 4,12,482 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించడం, 3,84,448 మంది గాయపడటం ఈ బృందం పరిగణనలోకి తీసుకుంది. ఎక్కువ ప్రమాదాలు డ్రైవర్లు అలసట, పరధ్యానం, అతివేగం కారణంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రమాదాల్లో మరణించే వారిలో 67 శాతం మంది 18-45 సంవత్సరాల మధ్య వయసు వారే కావడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో నిద్రమత్తు అధిగమించేలా, డ్రైవర్లను అప్రమత్తం చేసే పరికరాలు ధరలు రూ.25 వేల వరకు ఉన్నాయి. దీంతో వీరు తక్కువ ఖర్చుతో పరికరాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. బజర్, వైబ్రేటర్, మెర్కురీ, బ్యాటరీ తదితరాలను వినియోగించి సాధారణ కళ్లద్దాలను అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్గా అభివృద్ధి చేశారు. ఈ కళ్లద్దాలకు రూ.150 మాత్రమే ఖర్చవుతుందని గైడ్ టీచర్ దొరబాబు పేర్కొన్నారు.
ఆరోగ్య రాయబారి కవచం తయారు చేసిన చెట్టుపల్లి విద్యార్థులు
భవిష్యత్తుకు మార్గదర్శిగా.. : విద్యార్థి దశ నుంచే పిల్లల మనస్తత్వం అభివృద్ధి చేయాలన్నది ఉన్నతాధికారుల ఆదేశం. తదనుగుణంగా ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చార్టుల ద్వారా తమ ప్రాజెక్ట్ను వివరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ఎక్స్పోలు విద్యార్థులను ఎంతగానో చైతన్యం చేస్తాయి. భవిష్యత్తులో రాణించేందుకు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి.
ఏవీ రాజగోపాల్, గైడ్ టీచర్, చెట్టుపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్