‘ఎ’ గ్రేడ్లో ఉన్నా ఏం ఒరిగింది?
అనకాపల్లి జిల్లా కేంద్రమై ఏడాది పూర్తయింది. కానీ రవాణాపరంగా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా రైలు ప్రయాణికులకు ఎన్నేళ్లయినా ఎదురుచూపులే మిగులుతున్నాయి.
అనకాపల్లిలో ఆగని ముఖ్య ఎక్స్ప్రెస్లు
విశాఖ వెళ్తేనే దూరప్రాంతాలకు ప్రయాణం
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్టుడే
స్టేషన్లో పర్యటిస్తున్న డీఆర్ఎం (పాత చిత్రం)
అనకాపల్లి జిల్లా కేంద్రమై ఏడాది పూర్తయింది. కానీ రవాణాపరంగా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా రైలు ప్రయాణికులకు ఎన్నేళ్లయినా ఎదురుచూపులే మిగులుతున్నాయి. దక్షిణ మధ్యరైల్వేలో ‘ఎ’ గ్రేడ్ హదాలో ఉన్న ఈ స్టేషన్ల వసతుల పరంగా కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ అందరికీ కావాల్సిన ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపడానికి మాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగావిశాఖపట్నమో, దువ్వాడ వెళ్లక తప్పడం లేదు.
అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఈ జిల్లాతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రయాణికులు సైతం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ స్టేషన్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. విజయవాడ-విశాఖపట్నం ప్రధాన రైలుమార్గంలో ఉండటంతో 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా ఇక్కడ ఆగుతున్నవి పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి.
ప్రయాణికుల రద్దీ, లభిస్తున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు సదుపాయాలు కల్పించారు. ఒకటి, రెండు ప్లాట్ఫాంలపై ఎస్కలేటర్లు, వైఫై, అదనపు బుకింగ్ కౌంటర్లు, సోలార్ పవర్, సీసీ కెమెరాలు, నిరంతరం ఆర్పీఎఫ్ పహారా, శుద్ధ జల ప్లాంట్, అధునాతన బెంచీలు, వెయిటింగ్ రూమ్లు ఇలా పలు రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఈ విషయంలో ప్రయాణికులు మన్ననలు అందుకుంటున్న రైల్వే అధికారులు ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్ ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారు. ‘ఎ’ గ్రేడ్ హోదా ఉన్నా కావల్సిన ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగక పోవడంపై ఉసూరుమంటున్నారు. దీనిపై డైలీ పాసింజర్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాహిత బ్రహ్మకుమారీలు, ప్రజాసంఘాల నాయకులు పలుమార్లు రైల్వే జీఎం, డీఆర్ఎం, ఎంపీలకు వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు అనకాపల్లిలో హాల్ట్ ఇవ్వాలని కోరారు. ఏళ్లు గడుస్తున్నా.. కొత్తగా రైళ్లు పట్టాలెక్కుతున్నా ఏవీ అనకాపల్లిలో ఆగడం లేదు. దూరప్రాంతాలకు వెళ్లేవారంతా వ్యయప్రయాసలు భరించి దువ్వాడ, విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోంది. విశాఖ నుంచి బయలుదేరే ఎక్స్ప్రెస్ల్లోనూ కొన్నింటికి హాల్టు లేకపోవడం గమనార్హం.
ఆదాయం కళకళ: అనకాపల్లి రైల్వేస్టేషన్ను ఆనుకొని నిత్యం 8500లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక పండగలు, సీజన్ సమయాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. రోజూ ప్రయాణికుల నుంచి 7 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. కావల్సిన ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపితే రిజర్వేషన్, జనరల్ టిక్కెట్లు ద్వారా ఆదాయం సైతం రెట్టింపు అవుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్కు తప్పనిసరిగా 40 టిక్కెట్లు అమ్ముడుపోవాలి. కానీ ఈ స్టేషన్ నుంచి ప్రతి రైలుకు తప్పనిసరిగా 100 నుంచి 150 టిక్కెట్లు ఉంటాయి. డిమాండ్ ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్లకు అనుగుణంగా సర్వే చేపడితే తప్పనిసరిగా వంద టిక్కెట్లు వస్తాయనేది స్థానిక ప్రయాణికుల మాట.
వీటికి హాల్టులిస్తే మేలు
ఫలక్నుమా, యశ్వంత్పూర్-టాటా, హటియా యశ్వంత్పూర్, తిరుపతి-సంత్రాగచ్చి, యశ్వంత్పూర్-హావ్డా, విల్లుపురం-ఖరగ్పూర్, కన్యాకుమారి-దిబ్రూగఢ్, చెన్నై-షాలిమర్, విశాఖ-ఎల్టీటీ, కోరమండల్, అమరావతి, కొల్లాం, తిరుపతి హమ్సఫర్, నాగావళి రైళ్లకు హాల్ట్ ఇవ్వడం లేదు. వీటితోటు విపరీతమైన డిమాండ్ ఉన్న విశాఖపట్నం-నాందేడ్, అమరావతి ఎక్స్ప్రెస్, విశాఖ-గాంధీధాం, భువనేశ్వర్-బెంగుళూరు, భువనేశ్వర్-తిరుపతి, నిజాముద్దీన్ స్వర్ణజయంతి, హౌరా-కన్యాకుమారి రైళ్లు సైతం స్టేషన్లో ఆపడం లేదు.
స్టేషన్లో రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు
దువ్వాడలో దిగి రావాల్సి వస్తోంది
అనకాపల్లి రైల్వేస్టేషన్లో డిమాండ్ ఉన్న రైళ్లు ఆపకపోవడం దుర్మార్గం. ఏ గ్రేడ్ హోదా ఉన్నా చాలా ఎక్స్ప్రెస్లు ఆపడం లేదు. కావల్సిన రైళ్ల కోసం విశాఖపట్నం, దువ్వాడ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. దువ్వాడలోనో, విశాఖపట్నంలోనో దిగి తిరిగి వేరే రైలు పట్టుకొని అనకాపల్లి రావాల్సి వస్తోంది. అనకాపల్లి జిల్లాగా ఏర్పడినా స్టేషన్కు ప్రాధాన్యం పెరగకపోవడం సరికాదు.
ఎం.గణేష్, అనకాపల్లి
ఉన్నతాధికారులకు పంపాం
కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని ప్రయాణికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ముఖ్యంగా యశ్వంత్పూర్, సంబల్పూర్, గాంధీధాం, ఎల్టీటీ, కొల్లం, కోరమండల్ వంటి రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని ప్రయాణికులు అడుగుతున్నారు. కొంతమంది ప్రయాణికులు వినతి పత్రాలు ఇచ్చారు. ప్రయాణికులు ఏ రైళ్ల్లు ఆపాలని కోరుతున్నారో వాటి వివరాలను ఉన్నత అధికారులకు పంపించాం. దీనిపై నిర్ణయం ఉన్నతాధికారులే తీసుకోవాల్సి ఉంది.
వెంకటేశ్వరరావు, స్టేషన్ సూపరింటెండెంట్
రైల్వే అధికారులతో చర్చిస్తున్నా
అనకాపల్లి స్టేషన్లో ప్రయాణికులు కోరుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వడంపై రైల్వే జీఎం, మంత్రితో చర్చించాను. దీనిపై ప్రయాణికులు, ప్రజాసంఘాల నాయకులు స్వయంగా కలసి వినతి పత్రాలు ఇచ్చారు. ప్రయాణికులు ఏ రైళ్లు ఆపాలని కోరుతున్నారో వాటి వివరాలను ఇప్పటికే రైల్వే అధికారులకు అందించాను. త్వరలో కావాల్సిన రైళ్లు ఆపేలా చర్యలు చేపడతాం.
సత్యవతి, ఎంపీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
[ 24-04-2024]
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు
[ 24-04-2024]
ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళపై ప్రియుడి దాడి
[ 24-04-2024]
మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. -
ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
[ 24-04-2024]
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు
[ 24-04-2024]
అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేస్తున్నారు. -
మాడుగులను అగ్రగామిగా నిలుపుతా
[ 24-04-2024]
మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. -
చేతకాక చేతులెత్తేశారు...
[ 24-04-2024]
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం