logo

సాగరంతో బంధం... రహదారికి అందం

జీ20 సన్నాహక సమావేశాలకు విశాఖ ముస్తాబవుతోంది. ఈ నెల 28 నుంచి జరిగే ఈ సదస్సులకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు.

Published : 27 Mar 2023 04:38 IST

కైలాసగిరి పైనుంచి అందంగా కనిపిస్తున్న  తీర ప్రాంత రహదారి

జీ20 సన్నాహక సమావేశాలకు విశాఖ ముస్తాబవుతోంది. ఈ నెల 28 నుంచి జరిగే ఈ సదస్సులకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దీంతో ఆర్కేబీచ్‌- రుషికొండ తీర మార్గంలో సుందరీకరణ పనులు చేపట్టారు. రోడ్ల నిర్మాణంతో పాటు ఆయా ప్రాంతాలకు తగినట్లు రంగులు వేశారు. అలాగే కైలాసగిరిపై శివపార్వతుల విగ్రహాలకు రంగులు వేస్తూ తీర్చిదిద్దుతున్నారు. కైలాసగిరి కొండపై నుంచి చూస్తే తెన్నేటిపార్కు- సతీకొండ వెళ్లే మార్గం చూడముచ్చటగా కనువిందు చేస్తోందని సందర్శకులు పేర్కొంటున్నారు.

రంగులతో తీర్చిదిద్దుతున్న శివపార్వతుల విగ్రహాలు

ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని