ఉత్తరాంధ్రపై ప్రేమంటే ఇదేనా..!
విశాఖను రాజధాని చేసి తీరతాం.. మరికొద్ది నెలల్లో ముఖ్యమంత్రి మకాం ఇక్కడకు మార్చబోతున్నారు.. ఈ ప్రాంతం దశ, దిశ మారిపోతుందం’టూ స్థానిక వైకాపా నేతలు ఊదరగొడుతున్నారు.
బడ్జెట్ కేటాయింపుల్లో సుజలస్రవంతికి ఏటా నిరాశే
అరకొర నిధులిస్తే.. అడుగులు పడేదెట్టా..?
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా పెదపూడి వద్ద రిజర్వాయర్ నిర్మించాల్సిన ప్రాంతం
విశాఖను రాజధాని చేసి తీరతాం.. మరికొద్ది నెలల్లో ముఖ్యమంత్రి మకాం ఇక్కడకు మార్చబోతున్నారు.. ఈ ప్రాంతం దశ, దిశ మారిపోతుందం’టూ స్థానిక వైకాపా నేతలు ఊదరగొడుతున్నారు. సీఎం జగన్ కూడా పలు సందర్భాల్లో ఉత్తరాంధ్రపై ప్రేమను ఒలకబోస్తున్నారు.. రాజధాని అంటూ పేరు పెట్టడం మీద చూపుతున్న ఈ అభిమానం తమపై చూపడం లేదని ఈ ప్రాంత అన్నదాతలు స్పష్టంచేస్తున్నారు.
మూడు జిల్లాల రైతులకు కీలకమైన బాబూ జగ్జీవన్రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత నాలుగేళ్లగా బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులు చూస్తేనే తమపై ఎంత ప్రేముందో అర్థమైపోతుంది అంటున్నారు. భూసేకరణ, నిర్మాణ పనులకు రూ.వేల కోట్లలో అవసరమని ప్రతిపాదిస్తే రూ.వందల కోట్లలో కేటాయిస్తున్నారు..వాటిని కూడా విడుదల చేయకుండా ఖాతాల్లో అట్టిపెట్టుకోవడంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు.
ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు దశల్లో రూ.17,050 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును పూర్తిచేయడానికి పరిపాలనా అనుమతులు ఎప్పుడో ఇచ్చారు.
* తొలిదశ పనులను రెండు ప్యాకేజీలుగా 2017లోనే రూ.2,022 కోట్ల అంచనా విలువతో గుత్తేదారుకు పనులు అప్పగించారు. తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ పనులు పూర్తిగా మందగించాయి.
* వైకాపా ప్రభుత్వం వచ్చాక రెండోదశలో చేపట్టాల్సిన మరో రెండు ప్యాకేజీ పనులను రూ.3,800 కోట్లతో రెండు సంస్థలకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఇవ్వాల్సిన నిధుల విషయంలోనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. టెండర్లు పిలిచి పనులు అప్పగించడంలో చూపిన చొరవ బడ్జెట్లో కేటాయింపులపై చూపక పోవడంతో నాలుగేళ్లయినా తొలిదశ పనులు ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు.
తీడ గ్రామానికి సమీపంలో ప్రాజెక్ట్ పనుల కోసం గుత్తేదారు సంస్థ నిర్మించుకున్న తాత్కాలిక వసతి
అత్తెసరుగానే నిధులు
సుజలస్రవంతి రెండు దశల్లోని నాలుగు ప్యాకేజీలకు కలిపి 16,046 ఎకరాలు అవసరం అవుతాయి. వీటిలో ఇప్పటి వరకు 7,406 ఎకరాలకు సర్వే పూర్తిచేసి ల్యాండ్ పొజిషన్ (ఎల్పీ) షెడ్యూల్ను విడుదల చేశారు. మిగతా తొమ్మిది వేల ఎకరాల సర్వే తుదిదశలో ఉంది. రైతులకు పరిహారం చెల్లించి ఆ భూములను సేకరించాల్సి ఉంది. దీనికోసం ముందుగా రూ.2 వేల కోట్లు, సివిల్ వర్క్స్ కోసం మరో రూ.2 వేలు కోట్లు అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు. ఆ మేరకు నిధులు కోరితే అందులో 30 శాతమైనా ఇస్తారని ఆశించారు. అయిదు శాతం నిధులు కూడా బడ్జెట్లో కేటాయించడం లేదు.
గతేడాది రూ.297 కోట్లు కేటాయించినా కేవలం రూ.8.78 కోట్లు మాత్రమే సర్వే, ఇతర పనులకు ఖర్చుచేశారు.
గతేడాది రూ.900 కోట్లు విడుదల చేయాలని కోరినా సర్కారు స్పందించలేదు సరికదా తాజా బడ్జెట్లో గతేడాది కంటే రూ.155.71 కోట్లు కోతపెట్టడం విశేషం.
ఈ నిధులతో భూసేకరణకు ఎలా వెళ్లాలో అధికారులకు తెలియక సర్వేలు..నిర్మాణాల నమూనాలపై కసరత్తుతోనే సరిపెట్టుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో మాఫియాల స్వైర విహారం: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
[ 24-04-2024]
ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.