నేర వార్తలు
కొబ్బరి చెట్టు పైనుంచి బోండాలు తెంచే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. నక్కపల్లి మండలం రమణయ్యపేటకు చెందిన వీర్ల సురేష్ (34) బయట ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్తుంటాడు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
నక్కపల్లి, న్యూస్టుడే: కొబ్బరి చెట్టు పైనుంచి బోండాలు తెంచే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. నక్కపల్లి మండలం రమణయ్యపేటకు చెందిన వీర్ల సురేష్ (34) బయట ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్తుంటాడు. కొత్త అమావాస్య పండగకు ఇంటికి వచ్చిన ఆయన ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద కొబ్బరి చెట్టు నుంచి బోండాలను ఇనుప చువ్వతో తెంచేందుకు యత్నించగా.. పట్టుతప్పి పక్కనే ఉన్న హెచ్టీ లైన్ను తగలడంతో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. మృతుడి భార్య భవ్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. సురేష్కు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు చేశారు. సురేష్ మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
బియ్యం బస్తాల మాటున గంజాయి రవాణా
కశింకోట, న్యూస్టుడే: బియ్యం బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. నర్సీపట్నం నుంచి అనకాపల్లి వైపు బియ్యం బస్తాల లోడుతో వస్తున్న లారీని కశింకోట ఎస్సై ఎ.ఆదినారాయణరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ ఆదివారం అర్థరాత్రి తనిఖీ చేశారు. లారీ లోపల గంజాయి బస్తాలు బయట పడ్డాయి. డ్రైవరు హరదేవ్సింగ్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గుప్తా అనే వ్యక్తి మన్యం నుంచి గంజాయిని కొనుగోలు చేసి బిహార్, జార్ఖండ్, హరియాణా రాష్ట్రాలకు రవాణా చేస్తుంటాడని తెలిపాడు. ఈ క్రమంలో తన లారీని కిరాయికి తీసుకొని బియ్యం బస్తాల మాటున గంజాయిని తరలిస్తున్నట్లు పేర్కొన్నాడు. రూ. 18 లక్షల విలువ చేసే 890 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అనకాపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు సీఐ వివరించారు.
23 కేజీల గంజాయి స్వాధీనం
రాజమహేంద్రవరం నేరవార్తలు: విశాఖ ఏజెన్సీ నుంచి కేరళ రాష్ట్రానికి గంజాయి రవాణా చేస్తున్న అయిదుగురిని అరెస్టు చేసినట్లు రాజమహేంద్రవరం సెబ్ ఉత్తర స్టేషన్ సీఐ పి.వెంకటరమణ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న అయిదుగురిని సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నాలుగు సంచుల్లో 23.410 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. డొంక ప్రదీప్కుమార్, నయన సురేష్ (విశాఖపట్నం), బాకా గోవర్ధన్ (అరకు) ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన టిస్సన్ జోసఫ్, జిస్టు కంజిరతిల్లకు అమ్ముతుంటారు. వారు ఆ రాష్ట్రానికి తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ముగ్గురూ మార్గంమధ్యలో గంజాయిని జోసఫ్, రతిల్కు అందజేసే క్రమంలో రాజమహేంద్రవరంలోని సెబ్ అధికారులకు చిక్కారు. ఏజెన్సీలో రూ.లక్షకు కొనుగోలు చేసి, తిరిగి రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారని, గత ఆరు నెలలుగా వీరు ఈ వ్యాపారం చేస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేెలిందని సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?