అప్పన్న తిరు కల్యాణోత్సవం చూతము రారండి..
సింహగిరిపై కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 2న అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు.
దర్శన వేళలు.. ఆర్జిత సేవల్లో మార్పులు
సింహాచలం, న్యూస్టుడే: సింహగిరిపై కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 2న అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే కల్యాణోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి దర్శనం వేళలు, ఆర్జిత సేవల్లో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు.
1న అంకురార్పణతో శ్రీకారం
ఏప్రిల్ 1న రాత్రి 7 గంటల నుంచి కల్యాణోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా ఆ రోజు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని పేర్కొన్నారు. 2న రథోత్సవం, కల్యాణోత్సవం నిర్వహించనున్నందున మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 4 గంటల నుంచి ఆరాధన, విశేష హోమాలు, ధ్వజారోహణం, గ్రామ బలిహరణం జరుగుతాయి. రాత్రి 6.30 గంటల నుంచి ఎదురు సన్నాహోత్సవం, రాత్రి 8 గంటల నుంచి సింహగిరి మాడవీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 9.30 గంటల నుంచి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. ఆరోజు ఈ రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు దర్శనాలు కల్పించనున్నారు. 3న స్వామివారి తిరువీధి సేవ, ఆరాధన, హోమాలు, గ్రామ బలిహరణం జరుగుతాయి. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు లభించవు.
* 4న ఉదయం 7.30 గంటల నుంచి వైదిక సదస్యం నేపథ్యంలో భక్తులకు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి పండిత సదస్యం, సర్వజన మనోరంజని వాహనంపై గ్రామ తిరువీధి, రాత్రి 7 గంటల నుంచి ఆరాధన, 10 గంటలకు నివేదన జరుగుతాయి. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు లభించవు.
* 5న సాయంత్రం 5 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై స్వామివారి గ్రామ తిరువీధి నిర్వహించనున్నందున ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు లభించవు.
* 6న ఉదయం 6.30 గంటలకు పూర్ణాహుతి, అనంతరం బాలభోగం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, తిరువీధి, పవిత్ర గంగధారలో చక్రవారి అవబృదోత్సవం జరుగుతాయి. రాత్రి 7 గంటల నుంచి మృగయోత్సవంలో భాగంగా దొంగల దోపు ఉత్సవం, ధ్వజావరోహణము జరుగుతాయి. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవు.
* 7న ఉదయం 8 గంటల నుంచి వినోదోత్సవం, ముత్యాల పల్లకీ సేవ, 11 గంటలకు మహా సంప్రోక్షణ జరుగుతాయి. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తులకు దర్శనాలు లభించవు. మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. రాత్రి ఆరాధన, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధనలు, ఉయ్యాల సేవ, పవళింపు సేవ, ఏకాంత సేవతో వార్షిక కల్యాణోత్సవాలు పరిసమాప్తమవుతాయి.
* కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన టిక్కెట్లు రద్దు చేశారు. 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత