భూగర్భ జలం అడుగంటుతోంది..!
ఈ వేసవిలో విశాఖ నగరంలో నీటికి ఇక్కట్లు తప్పేలా లేవు. అనధికారికంగా ఎక్కడికక్కడ బోర్లు తవ్వి తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నగర శివారులోని ఏసీఏ, వీడీసీఏ స్టేడియంకు ఎదురుగా ఉన్న పలు అపార్టుమెంట్లలో ఇప్పటికే బోర్లు పనిచేయడంలేదు.
ఇష్టారాజ్యంగా బోర్ల తవ్వకం
నగర శివార్లలో నీటికి ఇక్కట్లు
కార్పొరేషన్, న్యూస్టుడే
ఓ నిర్మాణ స్థలంలో వేసిన బోరు
ఈ వేసవిలో విశాఖ నగరంలో నీటికి ఇక్కట్లు తప్పేలా లేవు. అనధికారికంగా ఎక్కడికక్కడ బోర్లు తవ్వి తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నగర శివారులోని ఏసీఏ, వీడీసీఏ స్టేడియంకు ఎదురుగా ఉన్న పలు అపార్టుమెంట్లలో ఇప్పటికే బోర్లు పనిచేయడంలేదు. ఇక్కడ 150 అడుగుల లోతు వరకు తవ్వినా బోర్లకు నీరు అందడం లేదు. నివాసితులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మధురవాడ, కొమ్మాది, మారికవలస తదితర ప్రాంతాల్లో మరో నెల రోజుల వ్యవధిలో భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అనంతరం ఆదర్శనగర్, రవీంద్రనగర్, ఆరిలోవ, ఎంవీపీకాలనీ, హెచ్బీకాలనీలలోనూ నీటి ఎద్దడి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. నగర శివార్లలో భారీ భవనాలు నిర్మించి హైటెక్ బోర్లు తవ్వి నీటిని ఇష్టానుసారంగా తోడేయడమే ఈ దుస్థితికి కారణమని వివరిస్తున్నారు.
లోపించిన ‘మహా’ పర్యవేక్షణ
తీరానికి ఆనుకుని ఉన్న నగరంలో భూగర్భ జలాల సంరక్షణపై మహా విశాఖ నగరపాలక సంస్థ పర్యవేక్షణ కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. బీచ్రోడ్డులో నిర్మాణదారులు, వాణిజ్య సముదాయాల యజమానులు భూమి పొరల్లోని నీటిని తోడేస్తుండడంతో ఉప్పునీరు నగర భూగర్భంలోకి చొచ్చుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు మేల్కొన్న దాఖలాలు లేవు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగర భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారిపోయే ప్రమాదముంది.
* సీఆర్జడ్ నిబంధనల మేరకు జీవీఎంసీ అధికారులు తరచూ తీరం ఒడ్డున ఉన్న భారీ అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లలో బోర్ల వినియోగంపై తనిఖీలు చేయాల్సి ఉంది. 2014లో బీచ్ రోడ్డులో అప్పటి జోనల్ కమిషనర్ 53 బోర్లను సీజ్ చేశారు. ఆ తరువాత వాటి వినియోగం తీరుపై ఎవరూ దృష్టి సారించకపోవడంతో మళ్లీ యథావిధిగా పనిచేస్తున్నాయి.
* 2019లో హనుమంతువాక నుంచి ముడసర్లోవ వరకు ఉన్న హెల్త్ సిటీలో ఆసుపత్రులు వినియోగిస్తున్న ఆరు బోర్లను జీవీఎంసీ మంచినీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారులు సీజ్ చేశారు. తర్వాత వాటి పరిస్థితిపై ఇప్పటి వరకు తనిఖీ చేయకపోవడం గమనార్హం. జీవీఎంసీ నుంచి మంచి నీటిని కొనుగోలు చేయాలంటే కిలోలీటరుకు రూ.50 చెల్లించాలి. దీంతో ఉచితంగా వచ్చే భూగర్భ జలాన్ని వాణిజ్య సముదాయాలు, ఇతర భారీ భవనాల యజమానులు తోడేసి వాడుకుంటున్నారు.
నిర్మాణ సమయంలోనే బోర్లు..: నిబంధనల మేరకు భారీ భవనాల నిర్మాణ సమయంలో అవసరమైన నీటిని జీవీఎంసీ నుంచి కొనుగోలు చేసుకుని వినియోగించుకోవాలి. నగరంలో ప్రస్తుతం ఎక్కడా ఆ పరిస్థితులు కనిపించడంలేదు. నిర్మాణం ప్రారంభించక ముందే బోర్లు తవ్వేస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్ బంగ్లాకు ఆనుకుని సిద్ధమవుతున్న ఓ నిర్మాణం వద్ద 12 బోర్లు వేశారు. వీటికి జీవీఎంసీ, భూగర్భ జలాల పర్యవేక్షణశాఖల నుంచి అనుమతులు లేవు. ఒకే ప్రాంతంలో 12 బోర్లు వేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి అనధికారంగా వినియోగంలో ఉన్న బోర్లను తొలగించి భూగర్భ జలాలను రక్షించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో మాఫియాల స్వైర విహారం: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
[ 24-04-2024]
ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..