logo

ట్రాక్టర్‌పై తరలిస్తున్న గడ్డి దగ్ధం

జాతీయ రహదారిపై నామవరం వద్ద ట్రాక్టర్‌పై పశుగ్రాసం తరలిస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైతు జి.శివ పశువుల మేత కోసం ఎండుగడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్‌పై తరలిస్తుండగా

Published : 29 Mar 2023 03:15 IST

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై నామవరం వద్ద ట్రాక్టర్‌పై పశుగ్రాసం తరలిస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైతు జి.శివ పశువుల మేత కోసం ఎండుగడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్‌పై తరలిస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి మంటలు అంటున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ గాంధీనగర్‌ కూడలిలో గడ్డితో ఉన్న తొట్టెను ఇంజిన్‌ నుంచి వేరు చేశాడు. సమాచారం అందుకున్న తుని అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని