2న అప్పన్న వార్షిక తిరు కల్యాణం
వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 2న వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు.
దర్శన వేళలు.. ఆర్జిత సేవల్లో మార్పులు
అప్పన్న ఆలయం
సింహాచలం, న్యూస్టుడే: వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 2న వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు జరిగే కల్యాణోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి దర్శనం వేళలు, ఆర్జిత సేవల్లో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఏప్రిల్ 1న రాత్రి 7 గంటల నుంచి కల్యాణోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని పేర్కొన్నారు. 2న రథోత్సవం, కల్యాణోత్సవం నిర్వహించనున్నందున మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 4 గంటల నుంచి ఆరాధన, విశేష హోమాలు, ధ్వజారోహణం, గ్రామ బలిహరణం జరుగుతాయి. రాత్రి 6.30 గంటల నుంచి ఎదురు సన్నాహోత్సవం, రాత్రి 8 గంటల నుంచి సింహగిరి మాడవీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 9.30 గంటల నుంచి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు దర్శనాలు కల్పించనున్నారు. 3న స్వామివారి తిరువీధి సేవ, ఆరాధన, హోమాలు, గ్రామ బలిహరణం జరుగుతాయి. రాత్రి 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు లభించవు. 4న ఉదయం 7.30 గంటల నుంచి వైదిక సదస్యం నేపథ్యంలో భక్తులకు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి పండిత సదస్యం, సర్వజన మనోరంజని వాహనంపై గ్రామ తిరువీధి, రాత్రి 7 గంటల నుంచి ఆరాధన, 10 గంటలకు నివేదన జరుగుతాయి. రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు లభించవు. 5న సాయంత్రం 5 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై స్వామివారి గ్రామ తిరువీధి నిర్వహించనున్నందున రాత్రి 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు లభించవు. 6న ఉదయం 6.30 గంటలకు పూర్ణాహుతి, అనంతరం బాలభోగం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, తిరువీధి, పవిత్ర గంగధారలో చక్రవారి అవబృదోత్సవం జరుగుతాయి. రాత్రి 7 గంటల నుంచి మృగయోత్సవంలో భాగంగా దొంగల దోపు ఉత్సవం, ధ్వజావరోహణము జరుగుతాయి. రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవు. 7న ఉదయం 8 గంటల నుంచి వినోదోత్సవం, ముత్యాల పల్లకీ సేవ, 11 గంటలకు మహా సంప్రోక్షణ జరుగుతాయి. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తులకు దర్శనాలు లభించవు. మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. రాత్రి ఆరాధన, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధనలు, ఉయ్యాల సేవ, పవళింపు సేవ, ఏకాంత సేవతో వార్షిక కల్యాణోత్సవాలు పరిసమాప్తమవుతాయి. 7వ తేదీ వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన టిక్కెట్లు రద్దు చేశారు. 16వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Harishrao: ఏపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్రావు
-
India News
MHA: మణిపుర్ హింసాత్మక ఘటనలు..! శాంతి స్థాపనకు కమిటీ ఏర్పాటు
-
General News
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
-
General News
KTR: ఈ-గవర్నెన్స్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: మంత్రి కేటీఆర్
-
Politics News
Amit Shah- Rahul Gandhi: రాహుల్.. మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకోండి: అమిత్ షా