logo

జి-20 పైలాన్‌ జాతికి అంకితం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి-20 సన్నాహక సదస్సు ఎప్పటికి గుర్తుండిపోయేలా పైలాన్‌ ఏర్పాటు చేయటం జరిగిందని మున్సిపల్‌ శాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

Published : 29 Mar 2023 03:15 IST

పైలాన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌, పక్కన మంత్రి అమర్‌నాథ్‌

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి-20 సన్నాహక సదస్సు ఎప్పటికి గుర్తుండిపోయేలా పైలాన్‌ ఏర్పాటు చేయటం జరిగిందని మున్సిపల్‌ శాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వుడా పార్కులో మంగళవారం సాయంత్రం జి-20 సన్నాహక సదస్సు నేపథ్యంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, వి.ఎం.ఆర్‌.డి.ఎ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని