కాలంతో పోటీ.. ఐఐఎంలో మేటి
విశాఖపట్నంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (ఐఐఎం)లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే
స్నాతకోత్సవంలో ‘బంగారు పతకాల’ బహూకరణ
ఐఐఎం ఏడో స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులు
విశాఖపట్నంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (ఐఐఎం)లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు. ఇక్కడ నేర్చుకున్నవాటితో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటామని తెలిపారు. ఈ పతకాలు సాధించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ ఐఐఎం ఏడో స్నాతకోత్సవం సందర్భంగా పీజీపీ, పీజీపీఎక్స్, పీజీపీడీజీఎం కోర్సుల్లో తొలి రెండు ర్యాంకులు, బెస్ట్ ఆల్రౌండ్, వాణిరావు మెమోరియల్ అవార్డు (అమ్మాయిల్లో తొలి ర్యాంకు) సాధించిన వారు బంగారు పతకాలు అందుకున్నారు. ఆ సంతోషాన్ని ‘ఈనాడు’తో పంచుకున్నారు.
కష్టపడితే సాధించగలం..
- అయాన్ వర్మ, పీజీపీ తొలి ర్యాంకు, బెస్ట్ ఆల్రౌండ్ పెర్ఫార్మర్
నా స్వస్థలం దిల్లీ. జర్నలిజం చదివాను. ఆ అనుభవమే మెరుగైన ఫలితాలు సాధించేలా నన్ను ముందుకు నడిపిస్తుంది. కొంచెం కష్టపడితే ఏదైనా సాధించగలం. రెండు బంగారు పతకాలు సాధిస్తానని ఊహించలేదు. నా కుటుంబంతోపాటు సమాజానికి మంచి చేయాలి. ఎప్పటికైనా అది సాధిస్తాను. విశాఖ అద్భుతమైన నగరం. విద్యాపరంగానే గాక పర్యాటక పరంగానూ ఆహ్లాదం కలిగించే ఈ ప్రాంతాన్ని అందరూ సందర్శించాలి.
వారి సహకారంతోనే..
- ప్రాప్తి అలోక్, పీజీపీ రెండో ర్యాంకు, వాణిరావు మెమోరియల్ అవార్డు గ్రహీత
మాది ఉత్తర్ప్రదేశ్లోని గజియాబాద్. రెండు బంగారు పతకాలు రావడం చాలా గర్వంగా ఉంది. ఇన్స్టిట్యూట్, ఆచార్యులు, బోధన సిబ్బంది సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీటెక్ తర్వాత రెండేళ్లు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశాను. ఉద్యోగం మానేసి ఉన్నత చదువులకు వెళ్తానంటే కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. విశాఖలో గడిపిన రెండేళ్ల కాలాన్ని మరచిపోలేను. ఐఐఎంలో డైరెక్టర్ నుంచి విద్యార్థి వరకు ఒకే కుటుంబంలా ఉన్నారు. భవిష్యత్తులో పీహెచ్డీ చేయాలని భావిస్తున్నాను.
స్టీల్ప్లాంట్లో పనిచేస్తూ..
- కునాల్ రంజన్, పీజీపీఎక్స్ తొలి ర్యాంకు
స్టీల్ప్లాంట్లో 2005 నుంచి పనిచేస్తున్నాను. సంస్థ సహకారం మరచిపోలేను. బంగారు పతకం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఉక్కు కర్మాగారం అభివృద్ధికి వీలైనంత కృషి చేస్తాను. భవిష్యత్తులో ఉన్నత చదువులకు వెళ్తాను. నేను సంపాదించిన జ్ఞానం, నేర్చుకున్న అంశాలు సమాజానికి ఉపయోగపడేలా పనిచేస్తాను. ముంబయి రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇక్కడ ఇంటర్వ్యూకు వచ్చాను. ఈ ప్రాంతం చాలా నచ్చడంతో అక్కడ ఉద్యోగం మానేసి స్టీల్ప్లాంట్లో చేరాను.
దేశానికి ఉపయోగ పడేలా
- మినాజ్ అహ్మద్, పీజీపీ డీజీఎం తొలి ర్యాంకు
మాది బిహార్లోని పట్నా. ప్రస్తుతం రక్షణ రంగం (డిఫెన్స్)లో విధులు నిర్వర్తిస్తున్నాను. బంగారు పతకం రావడం గర్వంగా ఉంది. కోర్సులో నేర్చుకున్న అంశాలతో దేశానికి మరింత మెరుగ్గా సేవ చేస్తాను. గతంలో పలుమార్లు విశాఖ వచ్చాను. అన్ని సమయాల్లోనూ ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తాను. ఇన్స్టిట్యూట్ స్థాపించిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ బోధన ఎంతో బాగుంది. కొత్తగా నిర్మిస్తున్న నూతన ప్రాంగణాన్ని ఇటీవల సందర్శించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్