నీరు నీడా లేదు!
గరిష్ఠవేతనం కావాలంటే రెండు పూటలా పనికి వెళ్లాలంటున్నారు.. పరదాల్లేకపోవడంతో చెట్లనీడనే సేదతీరాలని సలహాలిస్తున్నారు.. పనిచేసే చోట ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంచడం లేదు.
పని ప్రదేశాల్లో కానరాని కనీస సదుపాయాలు
ఉపాధి వేతనదారుల పరిస్థితి దయనీయం
ఈనాడు డిజిటల్, పాడేరు - న్యూస్టుడే, పాడేరు
ఎండలో పనిచేస్తున్న కూలీలు
‘ఉపాధిహామీ పనికి వెళ్లే వేతనజీవులకు ఎండల నుంచి ఉపశమనం కోసం పరదాలు ఇచ్చేవారు..
పనిచేసే చోట ఏమైనా గాయాలైతే ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో పెట్టేవారు.
వేసవిలో మజ్జిగ సరఫరా చేసేవారు..
మంచినీళ్లు తెచ్చుకున్నా..
పనిలో గునపం వినియోగించే కూలీలకు వారి
వేతనంలో కొంత మొత్తం కలిపేవారు.
ఎండ కాలం మొదలు అదనపు భత్యం ఇచ్చి ప్రోత్సహించేవారు’.
ఇదంతా రెండేళ్ల కిందటి మాట..
గరిష్ఠవేతనం కావాలంటే రెండు పూటలా పనికి వెళ్లాలంటున్నారు.. పరదాల్లేకపోవడంతో చెట్లనీడనే సేదతీరాలని సలహాలిస్తున్నారు.. పనిచేసే చోట ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంచడం లేదు. మజ్జిగ మాట అటుంచి మంచినీళ్ల సదుపాయం కూడా లేదు. గునపానికి డబ్బుల ఊసేలేదు.. వేసవి భత్యం కూడా కలవడం లేదు. మండుటెండలో పనిచేయలేక వేతనదారులు విలవిల్లాడిపోతున్నారు.
ఇదీ గతేడాది నుంచి ఉపాధి వేతనదారుల వెతలు
పనులు.. వేతనాలపైనా ప్రభావం
ఉపాధి పథకం అమలులో తీసుకువచ్చిన మార్పులు వేతనజీవులకు శరాఘాతంలా మారాయి. ఉమ్మడి జిల్లాలో 5.66 లక్షల మంది వేతనదారులున్నారు. వీరికి పని ప్రదేశాల వద్ద కనీస సదుపాయాలు కల్పించడం లేదు. గతేడాది వర్షాలు ఆలస్యంగా పడటంతో ఇప్పటికి చాలాచోట్ల చెరువుల్లో కొద్దిపాటి నీరు ఉంది. దీంతో సొంత గ్రామాల్లో పనులు అందుబాటులో లేక, దూరంగా ఇతర ప్రాంతాల్లో పనులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది దూరాభారం నడిచి వెళ్లి వస్తున్నారు. భగభగమండే ఎండల్లో గంటల తరబడి మట్టి పనులు చేయాల్సి రావడంతో శ్రమజీవులు అలసటకు గురవుతున్నారు. సేదతీరడానికి సమీపంలో ఎక్కడా నీడ లేక చెట్లు పుట్టలు చాటున గంజినీళ్లు తాగుతున్నారు. గతేడాది నుంచి వేసవి భత్యం కూడా కలపడం లేదు. ఫలితంగా వేతనదారులు గరిష్ఠ వేతనానికి దూరంగా నిలిచిపోవాల్సి వస్తోంది. రోజుకు రూ.257 వేతనం సంపాదించడానికి అవకాశం ఉన్నా రూ.200 మించి వేతనం అందుకోలేకపోతున్నారు.
సదుపాయాలు సున్నా..
‘ఉపాధి కూలీలకు టెంట్లు ఎప్పుడు సరఫరా చేస్తారు?, మండుటెండలో పని చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేసవికి ముందే ఏర్పాటు చేయాలి కదా.’ అంటూ ఫిబ్రవరిలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఓ జడ్పీటీసీ సభ్యుడు డ్వామా అధికారులను ప్రశ్నించారు. టెంట్ల సరఫరా కోసం టెండర్ పిలుస్తామని సమాధానమిచ్చిన అధికారులు మార్చి నెల ముగుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయలేదు. గత కొన్నిరోజులుగా వేసవి ఎండలు మండిపోతున్నాయి. పనిచేసే చోట ప్రథమ చికిత్స కిట్ ఉన్నా లేకున్నా కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లయినా అందుబాటులో ఉంచాలి. అవి కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నీళ్ల సీసా అయిపోతే గొంతు తడుపుకోవడానికి గంటల తరబడి నిరీక్షించాల్సిందే. అలాంటప్పుడు వడదెబ్బకు గరయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు.
ఎవరూ పట్టించుకోవడంలేదు: గతంలో పనికి వెళ్తే మజ్జిగ ఇచ్చేవారు, తాగునీటికి డబ్బులు చెల్లించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనిపై వీఆర్పీని అడిగితే అవేవీ ఇప్పుడు ఇవ్వడంలేదని చెబుతున్నారు. ఎండగా ఉంది ఎక్కడైనా కూర్చుందామంటే నీడ కనబడటంలేదు. గంజినీళ్లు కూడా ఎండలోనే తాగాల్సి వస్తోంది. మున్ముందు ఎండలు మరింత పెరుగుతాయి. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఆర్.సత్యవతి, కె.సూర్యకాంతం
దెబ్బ తగిలితే ఆసుపత్రికే వెళ్లాలి: ఉపాధి పనికి మా గ్రామంనుంచి చాలా మంది ఎంతదూరమైనా నడిచే వెళుతున్నాం. పని ప్రాంతంలో ఎవరికైనా చిన్నచిన్న గాయాలైతే, గతంలో చికిత్స చేసుకోవడానికి కిట్ దగ్గరే ఉండేది. ఇప్పుడ ఆ కిట్లు ఏవీలేవు నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిందే. పొట్టకూటికి పని చేసుకోవాలి కాబట్టి ఇబ్బందులు పడుతున్నా పనిలోకి వెళుతున్నాం.
యు.లక్ష్మి, కె.అమ్మాజీ
ప్రత్యేకంగా నిధులేమీ లేవు..: ఉపాధి కూలీల రక్షణ కోసం గతంలో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులుండేవి. పనిచేసే చోట నీడ కల్పించేందుకు టెంటుల ఏర్పాట్లు, మందుల కిట్లు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించేవాళ్లం. ప్రస్తుత వేసవి కాలంలో ఎండల నుంచి కూలీలు ఉపశమనం పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక నిధులేవీ రావడం లేదు. కూలీలకు ఈ ఖర్చులన్నీ కలిపి చెల్లిస్తున్నారు. మొన్నటివరకు ఒక్కో కూలీకి వేతనం రూ.257 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.15 మేర పెరిగింది.
రమేష్రామన్, డ్వామా పీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు