వీడియోలో ఆవేదన.. విషాద ఘటన!!
ఉక్కు ఉద్యోగి దంపతులు అదృశ్యమైన ఘటన చివరికి విషాదాంతమయింది. తిరుమల నగర్ సమీపంలోని శివాజీనగర్లో నివాసం ఉంటున్న వరప్రసాద్, మీరా దంపతులు సోమవారం రాత్రి అదృశ్యమయ్యారు.
న్యూస్టుడే, కూర్మన్నపాలెం
ఉక్కు ఉద్యోగి దంపతులు అదృశ్యమైన ఘటన చివరికి విషాదాంతమయింది. తిరుమల నగర్ సమీపంలోని శివాజీనగర్లో నివాసం ఉంటున్న వరప్రసాద్, మీరా దంపతులు సోమవారం రాత్రి అదృశ్యమయ్యారు. వారి మృతదేహాలు బుధవారం ఉదయం ఏలేరు కాలువలో బయటపడ్డాయి.
దాదాపు 38 గంటలపాటు గాలించగా.. చివరికి విగతజీవులై ఈ దంపతులు కనిపించడంతో స్వస్థలం కణితి కాలనీలో విషాదం నెలకొంది. మృతదేహాలను తీసుకురావడంతో నిర్వాసిత తెలుకలవీధిలోని కుటుంబ సభ్యులతోపాటు, స్నేహితులు, తెలుకల సంఘం నాయకులు వడ్లపూడి సీడబ్ల్యూసీ కూడలివద్దకు చేరుకున్నారు. వరప్రసాద్ తల్లి, కుమార్తె దివ్యలక్ష్మి, కుమారుడు కృష్ణసాయితేజ కన్నీరుమున్నీరయ్యారు. తెలుకల సంఘం నాయకులు, ఉక్కు ఓబీసీ సంఘం నాయకులు శ్మశాన వాటికకు చేరుకొని నివాళులర్పించారు.
* సోమవారం సాయంత్రం 6.30: అపార్టుమెంటు వాచ్మెన్కు ఇంటి తాళాలు ఇచ్చి గాజువాక వెళ్తున్నామన్నారు.
* 6.40: వడ్లపూడి నిర్మలా స్కూలు సమీపంలో బ్యాటరీ దుకాణం నుంచి వరప్రసాద్ తల్లి, కుమారుడు కృష్ణసాయితేజ ఇంటికి వచ్చారు.
* రాత్రి 7.00: వరప్రసాద్కు కృష్ణసాయితేజ ఫోన్ చేయగా గాజువాక వెళ్లామని సమాధానమిచ్చారు.
* 7.30: మీరా ఇంటిలో ఫోన్ విడిచిపెట్టి వెళ్లగా.. అందులోని సెల్ఫీ వీడియో చూసిన కృష్ణసాయితేజ...తండ్రికి ఫోన్ చేసేటప్పటికి స్విచ్ ఆఫ్ చేసి ఉంది.
* 8.00: వరప్రసాద్ ఫోన్ను గూగుల్లో పరిశీలించగా అనకాపల్లి జిల్లా కొప్పాక వద్ద ఏలేరు కాలు వద్ద ఉన్నట్లు తెలిసింది. ః 8.35: కృష్ణసాయితేజ, అతని స్నేహితులు ఏలేరు కాలువ వద్దకు చేరుకున్నారు. చెప్పులు, హ్యాండ్ బ్యాగు, చరవాణి, ద్విచక్రవాహనం, రెండు జతల దుస్తులు గుర్తించారు. ః 9.30: కృష్ణసాయితేజ ‘100’కు ఫోన్ చేసి పోలీసులకు వివరాలు వెల్లడించారు.
* 9.45: దువ్వాడ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వచ్చారు.
* మంగళవారం ఉదయం 6.30: కొప్పాక ఏలేరు కాలువవద్దకు కృష్ణసాయితేజ, కుటుంబ సభ్యులు, దువ్వాడ పోలీసులు, అనకాపల్లి సీఐ చేరుకున్నారు.
* 11.00: అప్పికొండనుంచి గజ ఈతగాళ్లను రప్పించి సాయంత్ర 5 గంటలవరకు వలల సాయంతో కాలువలో గాలించారు. అయినా ఆచూకీ తెలియలేదు.
* బుధవారం ఉదయం 8.00: అనకాపల్లి జిల్లా రాజుపాలెం వద్ద ఏలేరు కాలువలో మృతదేహాలను అక్కడ విధుల్లో ఉన్న స్వీపర్ గుర్తించాడు.
* 8.15: అనకాపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
* 9.00- 9.30: దువ్వాడ ఎస్ఐ దేముడునాయుడు, అనకాపల్లి సీఐ నర్సింగరావు, సిబ్బంది కాలువ వద్దకు చేరుకున్నారు. ః 2.30: మృత దేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
* సాయంత్రం 4.30: మృత దేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
* 5.15: వడ్లపూడి సీడబ్ల్యూసీ కూడలికి రెండు అంబులెన్స్ల్లో మృతదేహాలను తీసుకువచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా