logo

తెదేపా.. తెలుగు ప్రజల గుండె చప్పుడు

దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిందని విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Published : 30 Mar 2023 04:33 IST

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న పల్లా, పార్టీ నేతలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిందని విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఉదయం పార్టీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. తదుపరి పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తెదేపా ఆవిర్భావంతోనే రాష్ట్రంలోనే సామాజిక న్యాయం మొదలైందన్నారు. ఎన్టీఆర్‌ ఏ ఆశయాలతో పార్టీని స్థాపించారో వాటిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అపార అనుభవం ఉన్న చంద్రబాబునాయుడికి యువ నేత లోకేశ్‌ జతకలవడంతో పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు. వీరి నాయకత్వంలో రాబోవు ఎన్నికల్లో విజయపతాకం ఎగుర వేస్తామన్నారు. యువత తెదేపా పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చోడె వెంకట పట్టాభి, పుచ్ఛా విజయకుమార్‌, లొడగల కృష్ణ, పొడుగు కుమార్‌, బీసీ విభాగ అధ్యక్షులు తమ్మిన విజయకుమార్‌, తెలుగుయువత అధ్యక్షులు వలిశెట్టి తాతాజీ, విల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని