logo

ఆయన వెళ్లి నెలైంది.. అయినా..

అధికారులు మారినా బోర్డులపై వారిపేర్లు మాత్రం మారడం లేదు. జిల్లా కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం బోర్డులో ఇంకా పాత అధికారి ప్రసాద్‌ పేరు తొలగించకుండా

Published : 30 Mar 2023 04:33 IST

కలెక్టరేట్‌లోని జిల్లా పౌరసరఫరాల కార్యాలయం సమాచార బోర్డు వద్ద పాత డీఎస్‌వో పేరు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అధికారులు మారినా బోర్డులపై వారిపేర్లు మాత్రం మారడం లేదు. జిల్లా కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం బోర్డులో ఇంకా పాత అధికారి ప్రసాద్‌ పేరు తొలగించకుండా అలాగే ఉంచేశారు. జేసీ కల్పనాకుమారి నెలరోజుల క్రితం డీఎస్‌ఓను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఆ బాధ్యతలను ఏఎస్‌ఓకు అప్పగించారు. నెలరోజులు అవుతున్నా నామఫలకం, సమాచార హక్కు బోర్డులో మాత్రం ఆ పేరునే కొనసాగిస్తున్నారు. కొత్తగా కలెక్టరేట్‌కు వివిధ పనులపై వస్తున్నవారు ఇంకా డీఎస్‌ఓగా ప్రసాద్‌ విధుల్లో ఉన్నారనే భావిస్తున్నారు. చాలామందికి పౌరసరఫరాల కార్యాలయంలో డీఎస్‌ఓ ప్రసాద్‌ ఇక్కడ విధుల్లో లేరని తెలియక ఆ పేరుతోనే దరఖాస్తులు ఇస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని