logo

ఉక్కు పరిరక్షణకు విన్నపాలు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా అన్ని పార్టీల ఎంపీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హామీ ఇచ్చినట్టు విశాఖ ఉక్కు పోరాట

Published : 30 Mar 2023 04:33 IST

ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసిన ఉక్కు పోరాట కమిటీ నాయకులు

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా అన్ని పార్టీల ఎంపీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హామీ ఇచ్చినట్టు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. కార్మిక నాయకులు బుధవారం దిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలను కలిసి ఉక్కు పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కూడా కలుస్తామని పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్‌, జె.అయోధ్యరామ్‌, మస్తానప్ప, గణపతిరెడ్డి, వి.శ్రీనివాసరావు, కె.ఎస్‌.ఎన్‌.రావు తదితరులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని