డీ పట్టా నిబంధనతో.. డీలా!!
పట్టణ భూగరిష్ఠ పరిమితి (యూఎల్సీ) భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోపై నగరంలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
‘యూఎల్సీ’ భూముల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై ఆవేదన
ఈనాడు, విశాఖపట్నం
పట్టణ భూగరిష్ఠ పరిమితి (యూఎల్సీ) భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోపై నగరంలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఆ భూముల్లో ఇళ్లు కట్టుకొని తరాలుగా నివశిస్తున్నామని, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసినా పదేళ్ల వరకు అమ్ముకునే హక్కు ఉండదంటే ఎలా అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సొంతిళ్లని ధీమాగా ఉంటే డీపట్టా ఇచ్చి ఎటువంటి విలువ లేకుండా చేస్తారనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిని ఆర్థిక అవసరాలకు వినియోగించుకునే వీలు లేకుండా చేస్తే తమ పరిస్థితి మరింత దయనీయమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరా తీసి...
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జనవరి 31న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ విలువకు రెండింతలు డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకతవ్యక్తమైంది. అధికార పార్టీకి చెందిన నాయకులు సైతం వ్యతిరేకించారు. ఆ జీవోకు కొన్ని సవరణలు చేసి తాజాగా ఫిబ్రవరి 24న ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. సమాచారం తెలుసుకున్న కొందరు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్నారు. అధికారులను కలిసి వివరాలు తెలుసుకొని తిరిగొచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు సీతమ్మధార, చినగదిలి, గోపాలపట్నం, ఇతర మండల కార్యాలయాలకు ఎటువంటి దరఖాస్తులు అందలేదు. దరఖాస్తు చేసుకునేందుకు కొందరు వెళ్లినా డీపట్టా ఇస్తామని చెబుతుండటంతో ఆసక్తి చూపడం లేదు.
150 గజాల్లోపు ఉచితమైనా..: కొత్త ఉత్తర్వుల ప్రకారం 150 చదరపు గజాల్లోని నిర్మాణాలకు ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదు. ఉచితంగానే పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నగరంలో వంద గజాల్లోపు ఇళ్ల స్థలాలే అధికం. 100 నుంచి 150 గజాల మధ్య ఉన్నవీ ఎక్కువే. అయినప్పటికీ ఎవరూ దరఖాస్తుకు ముందుకు రావడం లేదు. సీతంపేట, గణేష్నగర్, రేసపువానిపాలెం, మాధవధార, లలితానగర్, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లో అటువంటి నిర్మాణాలు ఉన్నా చాలా మంది ముందుకు రావడం లేదు. 150 గజాల నుంచి 300 గజాల వరకు ప్రాథమిక విలువలో 15 శాతం, 300- 500 గజాల వరకు 30 శాతం, 500 గజాల కన్నా ఎక్కువ ఉంటే వంద శాతం చెల్లించేలా ఉత్తర్వులు రాగా ఏ కేటగిరీలో ఉన్నవారు కూడా స్పందించడం లేదు.
రెండు, మూడు రిజిస్ట్రేషన్లు జరగడంతో: ‘యూఎల్సీ’ భూముల ఆక్రమణదారులెవరూ చాలా చోట్ల అక్కడ లేరు. ఇతరులకు విక్రయించేశారు. ఇప్పటికే పలువురి చేతుల్లోకి మారి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అటువంటి వారు దరఖాస్తు చేయడానికి అసలు ఆసక్తి చూపడం లేదు. గాజువాక, సీతంపేట, లలితా నగర్, పెదగంట్యాడ, ములగాడ, పెందుర్తి, గోపాలపట్నం, విశాఖ గ్రామీణం, మహారాణిపేట , మాధవధార, కేఆర్ఎం కాలనీ, మురళీనగర్, సీతమ్మధార, రేసపువానిపాలెంలోని యూఎల్సీ భూముల్లో ఆక్రమణలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,800 నిర్మాణాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్