పేదల కళ్లల్లో వెలుగు
దేశంలోనే ఒకే ప్రాంగణంలో 22 వేల మందికి ఉపాధిని చూపిస్తూ రికార్డుకెక్కిన బ్రాండిక్స్ సంస్థ ఇప్పుడు పేద ప్రజలకు కంటిచూపును అందిస్తూ ఆదర్శనీయమైన సేవలు అందిస్తోంది.
40,234 మందికి ఉచిత వైద్య సేవలు
వంద వారాలు దాటిన బ్రాండిక్స్ శిబిరాలు
అచ్యుతాపురం, న్యూస్టుడే
శిబిరంలో కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు
దేశంలోనే ఒకే ప్రాంగణంలో 22 వేల మందికి ఉపాధిని చూపిస్తూ రికార్డుకెక్కిన బ్రాండిక్స్ సంస్థ ఇప్పుడు పేద ప్రజలకు కంటిచూపును అందిస్తూ ఆదర్శనీయమైన సేవలు అందిస్తోంది. ఇక్కడి కంటి శిబిరానికి వచ్చే వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ.. పైసా ఖర్చులేకుండా నమ్మకమైన సేవలు అందివ్వడంతో కంటి వైద్యశిబిరానికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గడం లేదు. నెలలో రెండు, నాలుగు ఆదివారాలు క్రమం తప్పకుండా నిర్వహించే శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి 800 మంది వరకు హాజరవుతున్నారు. 2017లో జనవరి 22న అచ్యుతాపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమైన కంటి వైద్య శిబిరానికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిపోవడంతో బ్రాండిక్స్ ఆవరణలో రూ.కోటిన్నరతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇలా ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండిక్స్ ఇప్పటివరకు 103 వారాల పాటు విజయవంతంగా శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాల ద్వారా 40,234 మందికి వైద్య సేవలు అందివ్వగా, వీరిలో 4 వేల మందికి మందికి శస్త్రచికిత్సలు చేయగా 25,736 మందికి కళ్లద్దాలు అందించారు. శిబిరాలకు హాజరయ్యే వారికి మజ్జిగ, అల్పాహారం, భోజనాలు కూడా అందిస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు గొర్లె గంగ. రాంబిల్లి మండలానికి చెందిన ఈ వృద్ధురాలి భర్త అనారోగ్యంతో మంచానపడ్డాడు. పిల్లలు లేరు. ఇలా పుట్టెడు కష్టంలో ఉన్న ఈమె కంటిచూపు నాలుగేళ్లగా మసమసకగా కనిపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంచానపడ్డ భర్తను గుర్తుకు తెచ్చుకుని కంటి శస్త్రచికిత్స చేయించుకోలేకపోయింది. చుట్టుపక్కలవాళ్లు బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరం గురించి చెప్పడంతో పాటు దగ్గరుండి శస్త్రచికిత్స చేయించడానికి ముందుకొచ్చారు. దీంతో గంగకు కంటిచూపు తిరిగి వచ్చింది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కె.సత్యవతి. విశాఖలో పేరున్న కంటి ఆసుపత్రులు, క్లినిక్లు ఎన్నో ఉన్నా బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరం అందిస్తున్న నమ్మకమైన సేవలు ఈమెను విశాఖ నుంచి అచ్యుతాపురం రప్పించాయి. వైద్య శిబిరానికి హాజరై సేవలు పొందింది. వేలాది రూపాయలు ఫీజు చెల్లించి ప్రైవేటు కంటి ఆసుపత్రులకు వెళ్లినా అందని సేవలు బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరం ద్వారా పొందానని మహిళ ఆనందంగా చెబుతోంది.
..ఇది ఏదో ఒకరిద్దరు మహిళలు చెప్పిన మాటలు కాదు. బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరంపై ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు ఉన్న నమ్మకానికి రెండు సాక్ష్యాలు.
మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు
- కొల్లి వరలక్ష్మి, వాలంటీర్, కంటివైద్యశిబిరం
బ్రాండిక్స్లో ఉచిత కంటి వైద్య శిబిరాల్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన 103 శిబిరాలకు హాజరై రోగులకు నా వంతు సాయం చేస్తున్నాను. ఇక్కడ చికిత్సలు పొందిన వేలాది మంది ఆప్యాయంగా పలకరించడంతో పాటు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు.
ఆత్మసంతృప్తి కల్గింది
- కేవీ.వేణుగోపాల్, ఏజీఎం, శంకర్ ఫౌండేషన్
కంటివైద్య శిబిరాలకు హాజరై రోగులకు అవసరమైన మార్గనిర్దేశం చేయడం ద్వారా ఎంతో గుర్తింపు వచ్చింది. శంకర్ ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి వైద్యసేవలు అందించినా బ్రాండిక్స్ కంటి వైద్యశిబిరం ద్వారా అందిస్తున్న సేవలు ఒక వ్యక్తిగా ఎంతో ఆత్మ సంతృప్తి పొందాను. సామాన్య ప్రజలకు ఇక్కడ అందుతున్న సేవలు ఆదర్శనీయం.
ఆ వృద్ధుడి బాధే కదిలించింది..
- దొరస్వామి, బ్రాండిక్స్ భారతీయ భాగస్వామి, అచ్యుతాపురం
విశాఖ నుంచి కంపెనీకి వస్తుండగా కళ్లు కనిపించని ఓ వృద్ధుడు అచ్యుతాపురం కూడలి దాటలేక ఇబ్బందిపడుతున్నాడు. అతన్ని రోడ్డు దాటించి కంటిచూపుపై ప్రశ్నిస్తే అందరూ ఉన్నా శస్త్రచికిత్స చేయించడంలేదని దీనంగా చెప్పాడు. అప్పుడే ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటుచేయాలనే ఆలోచన కల్గింది. శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా లక్షలాది మందికి పద్మశ్రీ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ అందిస్తున్న సేవలను తెలుసుకుని వారి ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించాం. ఆదాయం సంపాదిస్తేనే కుటుంబసభ్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. వయసు మీదపడి కళ్లు కనిపించకపోయినా పట్టించుకోవడం లేదు. ఇటువంటి వారికి కంటిచూపును అందివ్వడమే లక్ష్యంగా శిబిరాలు నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం