ఆర్థిక వనరుల పెంపుపై దృష్టిసారించాలి
మార్చి 28వ తేదీ నుంచి విశాఖ వేదికగా ప్రారంభమైన జి-20 సన్నాహక సదస్సులు శుక్రవారంతో ముగిశాయి. తొలుత రెండు రోజులపాటు నిర్వహించాలనుకున్నారు
ముగిసిన జీ20 సన్నాహక సదస్సులు
సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు
ఈనాడు-విశాఖపట్నం: మార్చి 28వ తేదీ నుంచి విశాఖ వేదికగా ప్రారంభమైన జి-20 సన్నాహక సదస్సులు శుక్రవారంతో ముగిశాయి. తొలుత రెండు రోజులపాటు నిర్వహించాలనుకున్నారు. అయితే మరో రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతినిధులు చివరి రోజు పట్టణాలు, నగరాల్లో వందశాతం పన్నుల వసూళ్లకు సలహాలు, సూచనలు చేశారు. వసూలైన పన్నులతో నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అన్ని వర్గాలు, వయసుల వారికి ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆర్థిక వనరులను పెంచుకోవడంలో భాగంగా విజయవంతమైన విధానాలను పైలెట్ ప్రాజెక్టులుగా ప్రారంభించి అనుకూలతలు చూడాలన్నారు. ఆర్థిక నగరాల అంశంపై విభిన్నమైన ఆలోచనలు వచ్చాయని, అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా ఉన్నాయని సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ అన్నారు. చివరి రోజు మున్సిపల్ కమిషనర్లు, విద్యార్థులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి ముగించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన