త్వరలో రాజధానిగా విశాఖ
విశాఖలో రాజధాని త్వరలో ఏర్పాటు అవుతుందని, ముఖ్యమంత్రి జగన్ ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.
ఎలమంచిలి, నక్కపల్లి, న్యూస్టుడే: విశాఖలో రాజధాని త్వరలో ఏర్పాటు అవుతుందని, ముఖ్యమంత్రి జగన్ ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి, నక్కపల్లి బాలికల గురుకుల పాఠశాలలను శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. పాఠశాల ఆవరణలో వసతులు తనిఖీ చేశారు. విద్యార్థులతో, కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. గురుకుల పాఠశాలల కోసం ముఖ్యమంత్రి జగన్ రూ. కోట్ల నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల వసతిగృహాల కంటే ఇక్కడ చక్కని సౌకర్యాలు ఉన్నాయన్నారు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు. తాము చదువుకునే రోజుల్లో ఇన్ని సదుపాయాలు లేవన్నారు. ఇంటర్ వరకు ఇక్కడే విద్య అందుతుండగా, ఆ తర్వాత పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి పంపుతున్నామని, క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ ప్రతిభ చూపి ఉద్యోగాలు సాధిస్తున్న వారుకూడా ఉన్నారని చెప్పారు. నాడు-నేడు పనులు చాలా బాగా చేశారన్నారు. ఇప్పటికే పనులు జరిగిన చోట్ల ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటినీ పరిష్కరిస్తున్నారని చెప్పారు. నక్కపల్లి గురుకులంలో మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ కావాలని కోరారని, వీటి పనులు చేయిస్తామన్నారు. బాలికలు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలసి మెస్లో భోజనాలు చేశారు. వంటకాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పదోతరగతి విద్యార్థులకు హాల్టికెట్లు పంపిణీ చేశారు. గురుకులాల జిల్లా సమన్వయకర్త ఎస్.రూపాదేవి, ప్రిన్సిపల్స్ కృష్ణతార, శారద, తహసీల్దార్లు నీరజ, రాణి అమ్మాజీ, ఎంపీపీలు బోదెపు గోవింద్, రత్నం, వైకాపా నాయకులు బొద్దపు ఎర్రయ్యదొర, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు ఆరెపు గుప్తా, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, సంతోష్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, సర్పంచులు జయరత్నకుమారి, సాదిరెడ్డి శ్రీను, ఎంపీడీఓ సీతారామరాజు తదితరులు మంత్రిని సత్కరించారు. ఎస్సీ కాలనీవాసులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని సూర్య, లోవరాజు వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు రెవెన్యూ కార్యాలయం సమీపంలోని ఎస్సీ కార్పొరేషన్ స్థలాన్ని మంత్రి నాగార్జున పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి