ఇక మూడుపూటలా కోడిగుడ్డు
కేజీహెచ్ డైట్ క్యాంటీన్ కొత్త మెనూ శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను రెట్టింపు చేసింది.
నేటి నుంచి కేజీహెచ్ డైట్లో మార్పు
రోగులకు ఆహారం పంపిణీ చేస్తున్న సిబ్బంది
వన్టౌన్, న్యూస్టుడే: కేజీహెచ్ డైట్ క్యాంటీన్ కొత్త మెనూ శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను రెట్టింపు చేసింది. ఇదే సమయంలో ఆహారం విషయంలో పలు మార్పులు చేసింది. 15ఏళ్ల నుంచి కేజీహెచ్లో రోగులకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. గుత్తేదారులు 10శాతం తగ్గించి టెండర్లు వేయడంతో రోజుకు ఒక్కో రోగిపై రూ.36 మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తూ వస్తోంది. దీని వల్ల నాణ్యత సరిగా ఉండడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోగుల డైట్ ఖర్చును రెట్టింపు చేసి రూ.80కు పెంచింది. ఇదే సమయంలో మెనూలో మార్పులు చేశారు.
* ఫిబ్రవరి నెలలో డైట్ గుత్తేదారుని నియమించేందుకు టెండర్లు పిలిచారు. నలుగురు గుత్తేదారులు ముందుకు వచ్చారు. నలుగురు ఒకే రకంగా కొటేషన్లు వేయడంతో ఒక్కొక్కరికి ఆరేసి నెలల చొప్పున డైట్ పనులను జిల్లా యంత్రాంగం అప్పగించింది. కొత్త కాంట్రాక్టు శనివారం నుంచి అమల్లోకి రానుంది.
ప్రస్తుత మెనూ ఇలా..:
* అల్పాహారం కింద పాలు/రొట్టె, కిచిడి, ఎర్రనూక ఉప్మా, తెల్లనూక ఉప్మాలో ఏదో ఒకటి ఇస్తున్నారు. బీ ఉదయం, రాత్రి భోజనంలో.. 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల సాంబారు, 160 గ్రాముల కూర, ఉడకబెట్టిన కోడి గుడ్డు, అరటి పండు, మజ్జిగ అందజేస్తున్నారు.
ఇక మీదట ఇలా..
* అల్పాహారంగా ఇడ్లీ 3(150 గ్రాములు), ఉప్మా, పాలు-రొట్టెల్లో ఏదో ఒకటి, ఉడకబెట్టిన కోడి గుడ్డు ఇవ్వనున్నారు.
* ఉదయం, రాత్రి భోజనంలో 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల సాంబారు, గ్రేవీ కర్రి లేదా ముద్దకూర, ఉడకబెట్టిన కోడి గుడ్డు, అరటి పండు, 200 గ్రాముల మజ్జిగ పంపిణీ చేయనున్నారు.
* కిడ్నీ వ్యాధి బాధితులకు ఉప్పు రహిత ఆహారం, మధుమేహ బాధితులకు అన్నం తక్కువ, ఉడకబెట్టిన కూరలు, పుల్కాలతో కూడిన ఆహారం ఇవ్వనున్నారు.
ఇడ్లీ, ఒక కోడిగుడ్డు మాత్రమే అదనం : పాత, కొత్త మెనూలను పరిశీలిస్తే.. కొత్త దాంట్లో కేవలం 3 ఇడ్లీ, ఒక కోడిగుడ్డు మాత్రమే అదనంగా ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మెనూకు ఛార్జీలు రెట్టింపు చేసి రూ.80 ఇస్తున్నారు. నాణ్యత పెంచుతామని, అధిక పోషక విలువలున్న ఆహారం రోగులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
పక్కాగా మెనూ అమలుకు చర్యలు
ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రోగులకు పంపిణీ చేసే ఆహారంలో శనివారం నుంచి మార్పులు చేస్తున్నాం. జేసీ ఆదేశాల మేరకు నలుగురు గుత్తదారులు ఒక్కొక్కరు ఆరు నెలల చొప్పున కాంట్రాక్టు నిర్వహిస్తారు. ఆహార నాణ్యత విషయంలో నిరంతర నిఘా ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆహారంతో పోల్చితే కొత్తగా ఇవ్వబోయే దానిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి.
-హెచ్.వి.ఆర్.మూర్తి, చీఫ్ డైటీషియన్, కేజీహెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్