Visakhapatnam: ఏసీ బోగీల్లో నరక యాతన.. తరచూ ఎందుకీ సమస్య?
రైళ్లలోని శీతల బోగీలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తరచూ ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నారు.
తరచూ పనిచేయని శీతల యంత్రాలు
రైల్వేస్టేషన్, న్యూస్టుడే: రైళ్లలోని శీతల బోగీలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తరచూ ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో ఈ పరిస్థితి తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో విశాఖ స్టేషన్లో రెండు గంటల పాటు రైలును నిలిపేశారు. సమస్య తలెత్తిన బోగీని యార్డుకు తీసుకెళ్లి మరమ్మతులు చేయించి పంపారు. శుక్రవారం తిరుమల ఎక్స్ప్రెస్లో ఏసీలు పనిచేయక ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. ఎలమంచిలి స్టేషన్లో రైలును ఆపి ఆందోళనకు దిగారు. తరచూ ఏసీ బోగీల్లో శీతలయంత్రాలు పనిచేయడం లేదని రైల్వే అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి.
తరచూ ఎందుకీ సమస్య: ఇటీవల రైల్వేబోర్డు పలు రైళ్లలో జనరల్, స్లీపర్ బోగీలను తగ్గించి శీతల(ఏసీ) బోగీలను పెంచింది. ఎల్హెచ్బీ బోగీలుగా మార్చిన తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్లో కేవలం మూడు స్లీపర్ బోగీలు మిగిలాయి. ఏసీ బోగీలు 14కు చేరుకున్నాయి. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో 5 స్లీపర్ బోగీలు ఉండగా, ఏసీ బోగీలు 11 ఉన్నాయి. తిరుమల ఎక్స్ప్రెస్లో 9 ఏసీ బోగీలు ఉండగా, 7 స్లీపర్ బోగీలు ఉన్నాయి. గతంలో ఐసీఎఫ్ ర్యాక్లు ఉన్నప్పుడు ఏసీ బోగీల కోసం పవర్ బ్యాటరీలను ఉపయోగించేవారు. ఎల్హెచ్బీలుగా మారిన తర్వాత బ్యాటరీలను తొలగించారు. ఇంజిన్ సామర్థ్యంతో ఏసీ బోగీలు నడుస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రైలింజిన్ వేగంగా నడుస్తున్నప్పుడే ఏసీలు పనిచేస్తున్నాయని, ఎక్కడైనా పది నిమిషాలు ఆగిందంటే పనిచేయడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఐసీఎఫ్ ర్యాక్లు ఉన్న గరీబ్రథ్ తదితర రైళ్లలో ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.
ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు..
ఆధునికీకరణ ఆలోచనలో ఉన్న రైల్వే ఇప్పటికే అధికశాతం రైళ్లను ఎల్హెచ్బీ ర్యాక్లుగా మార్పు చేసింది. దీంతో ఆయా రైళ్లలో సాధారణ బోగీలు తగ్గిపోయి..ఏసీ బోగీలు రెట్టింపయ్యాయి. పవర్కార్ బోగీలు ఉంటే ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తాయి. ప్రస్తుతం అధికశాతం రైళ్లలో ఒకటే పవర్కారు బోగీ ఉంచారని సమాచారం. ఏసీలు సరిగా పనిచేయకపోవడానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. ఒక వైపు వేసవి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి. అధికశాతం ప్రయాణికులు శీతల ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. ఆయా బోగీల్లో ఏసీలు తప్ప ఫ్యాన్లు ఉండవు. కిటీకీలు తెరవడానికి వీలుండదు. అలాంటి బోగీల్లో ఏసీలు పనిచేయకపోతే ఇక అంతే.. గాలి కూడా ఆడదు. ఊపిరి ఆడక విలవిల్లాడాల్సిందే.
* స్టేషన్లో రైలు ఆగినప్పుడల్లా ఏసీలు పనిచేయకపోవడంతో రాత్రుళ్లు నిద్ర సరిగా పట్టడం లేదని, వృద్ధులు, పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. జనరల్, స్లీపర్ బోగీలు తగ్గించి ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ ఏసీ బోగీల్లో సౌకర్యాలు పెంచడంపై లేదనే విమర్శలు రైల్వేబోర్డు మూటకట్టుకుంటోంది.
* ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత సమస్యకు కారణాలు విశ్లేషించి.. పరిష్కరించాల్సిన రైల్వే అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.