logo

ఏపీ నేవల్‌ ఇన్‌ఛార్జిగా కమొడోర్‌ రజనీష్‌శర్మ

ఆంధప్రదేశ్‌ నేవల్‌ ఇన్‌ఛార్జిగా కమొడోర్‌ రజనీష్‌శర్మ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.  విశాఖపట్నంలోని నేవల్‌ బేస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రస్తుత నేవల్‌ ఇన్‌ఛార్జి కమొడోర్‌ ఎం.గోవర్ధన్‌రాజు నుంచి బ్యాటన్‌ అందుకొని పదవీ బాధ్యతలు చేపట్టారు.

Published : 31 May 2023 03:43 IST

సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కమొడోర్‌ రజనీష్‌శర్మ

సింధియా, న్యూస్‌టుడే : ఆంధప్రదేశ్‌ నేవల్‌ ఇన్‌ఛార్జిగా కమొడోర్‌ రజనీష్‌శర్మ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.  విశాఖపట్నంలోని నేవల్‌ బేస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రస్తుత నేవల్‌ ఇన్‌ఛార్జి కమొడోర్‌ ఎం.గోవర్ధన్‌రాజు నుంచి బ్యాటన్‌ అందుకొని పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పుణె నేవల్‌ డిఫెన్స్‌ అకాడమీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1997 జులై 1న భారత నౌకాదళంలో చేరి నావిగేషన్‌, డైరెక్షన్‌ విభాగాల్లో ప్రత్యేక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్రన్‌ ప్లీట్‌లో ప్లీట్‌ నావిగేషన్‌ అధికారిగా, ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌, ఐఎన్‌ఎస్‌ అక్షయ్‌, ఫ్లీట్‌ సపోర్టు వెసల్‌ దీపక్‌లో కార్యనిర్వాహణ అధికారిగా పని చేశారు. ఆయన సతీమణి రేఖాశర్మ నౌకాదళ సంక్షేమ సంఘంలో చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు నేవీ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని