పరదాలు అడ్డుపెట్టి.. వేడికి మస్కా కొట్టి..
ఎండకు బయటకెళ్లలేక.. వేడికి ఇంట్లో ఉండలేక చెమటలు కక్కుతున్నారు. ఉపశమనానికి గదుల్లో ఏసీలు బిగించుకునే స్థోమత అందరికీ ఉండదు. తక్కువ ఖర్చుతో.. అసలు ఖర్చే లేకుండా ఇంటిని చల్లగా మార్చేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ఎండకు బయటకెళ్లలేక.. వేడికి ఇంట్లో ఉండలేక చెమటలు కక్కుతున్నారు. ఉపశమనానికి గదుల్లో ఏసీలు బిగించుకునే స్థోమత అందరికీ ఉండదు. తక్కువ ఖర్చుతో.. అసలు ఖర్చే లేకుండా ఇంటిని చల్లగా మార్చేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
* వేసవిలో గాలి వస్తుందని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం చాలా మందికి అలవాటు. గాలితో పాటు వేడి సైతం ఇంట్లోకి వస్తుంది. మొదటగా వేడికి అడ్డుకట్ట వేయాలి. కిటికీలు, తలుపులకు పరదాలు వేయాలి. కిటికీల వద్ద ఉన్న బ్లైండ్స్లను మూయాలి. ప్రత్యేకించి ఉత్తరం, పశ్చిమ వైపు ఉన్న కిటికీల నుంచి వేడి రాకుండా ముదురు రంగు పరదాలతో మూయాలి. వెలుతురు తగ్గితే లైట్లు వేసుకోవచ్చు. దీంతో చాలావరకు వేడి తగ్గిపోతుంది.
* కిటికీల్లో పూలు, అలంకరణ మొక్కలను పెంచుకోవడం ద్వారా వేడి నేరుగా ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడొచ్చు. మేడపైన తోట పెంచుకోవడం ద్వారా గ్రీన్రూఫ్గా మార్చుకోవచ్చు.
* అపార్ట్మెంట్ బాల్కనీల్లో ప్రస్తుతం స్లైడ్ డోర్లు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బాల్కనీల్లోంచి నేరుగా ఎండ, వేడి గాలి లోపలికి రాకుండా సమ్మర్ షేడ్ మ్యాట్లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం వెదురుతో సహా రకరకాల సామగ్రితో అందంగా తయారు చేసిన చాపలు దొరుకుతున్నాయి. వీటిని తడిపితే చల్లని గాలి లోపలికి వస్తుంది. సైడ్డోర్లు మూయాల్సిన పని ఉండదు. వేసవిలోనే కాదు వర్షాకాలంలో వాననీరు లోపలికి రాకుండా ఉపయోగపడుతుంది. ఇవేవి లేకపోయినా.. ఇంట్లో పాతబెడ్షీట్ను సైతం అడ్డుగా వేసుకోవచ్చు.
* వేసవిలో ఇంట్లో ఫ్యాన్లు 24 గంటలూ తిరుగుతుంటాయి. ఎక్కువ వేగంతో తిరిగితే మరింత వేడి గాలే వస్తుంది. అందుకే కావాల్సిన వేగంతో పెట్టుకోవాలి. మధ్యమధ్యలో ఆపి తిరిగి వేసుకోవాలి.
* సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గగానే కిటికీలు, తలుపులు తెరవడం ద్వారా బయటి నుంచి చల్లనిగాలి ఇంట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఇంట్లో ఉక్కపోత ఎక్కువ కాబట్టి గంటసేపు ఆరుబయట గడపడం మేలు.
* మేడపైన చల్లదనానికి కూల్ పెయింట్స్ వేసుకోవచ్చు.
* తెలుపు రంగు ఎల్ఈడీలు మేలు. వానాకాలం, శీతాకాలంలో వామ్ వైట్ లైటింగ్ను వినియోగించుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బోరు’మనిపించావ్ జగన్
[ 23-04-2024]
తెదేపా హయాంలో అమలుచేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి వైకాపా ప్రభుత్వం పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. దీనికింద ఉమ్మడి జిల్లాలో 20 వేల బోర్లు తీస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక రిగ్గు కేటాయిస్తున్నామంటూ సీఎం జగన్ హడావుడి చేశారు. -
పదోతరగతి ఫలితాల్లో జిల్లాల ర్యాంకులు కిందికి!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
జోరందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. -
వైకాపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం
[ 23-04-2024]
గిరిజన ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు నిండుగా అవకాశాలున్నా వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో అది అందని ద్రాక్షలా మారింది. -
రోడ్డు లేక ఇబ్బందులు
[ 23-04-2024]
అనంతగిరి మండలంలోని మారుముల చీడివలస, పాటిపల్లి, పట్టం, బందకొండ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు సోమవారం నిరసన చేపట్టారు. -
ఓటర్లను చైతన్యపర్చండి
[ 23-04-2024]
పోలింగ్లో అధికసంఖ్యలో ఓటర్లు పాల్గొనేలా చైతన్యపర్చాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.. భారతదేశ అంధుల క్రికెట్ జట్టు ఆల్రౌండర్ వలసినైని రవణిని కోరారు. -
కోలాహలంగా అభ్యర్థుల నామినేషన్లు
[ 23-04-2024]
పాయకరావుపేట కూటమి అభ్యర్థిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నామినేషన్ వేశారు. -
ప్రణాళికాలోపంతో గందరగోళం
[ 23-04-2024]
నక్కపల్లిలో సోమవారం జరిగిన ప్రధాన పార్టీల నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. -
పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోండి ఇలా..
[ 23-04-2024]
పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఎన్నికల కమిషన్ కొత్త విధానానికి నాంది పలికింది. ఎ -
కూటమి జోరుతో వైకాపా నేతల్లో భయం
[ 23-04-2024]
వైకాపాకు వెన్నులో వణుకుపుట్టేలా తెదేపా కార్యకర్తలు పనిచేయాలని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు. -
జనసేనలో చేరికలు
[ 23-04-2024]
ఎలమంచిలి 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సాయిప్రసన్న భర్త ఓగిబోయిన చిరంజీవి సోమవారం జనసేనలో చేరారు. -
గిరిజనులు చింత తీరేనా?
[ 23-04-2024]
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది చింతపండు దిగుబడులు గిరిజన రైతులను పూర్తిగా నిరాశపరిచాయి. -
గిరి విద్యార్థుల జయకేతనం
[ 23-04-2024]
పది ఫలితాల్లో గిరి విద్యార్థులు రాణించారు. ఫలితాలపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
[ 23-04-2024]
నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆరుగురు కీలక సభ్యులు విశాఖ రేంజి డీఐజీ విశాల్ గున్ని, అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. -
బూడి ఆస్తులు రూ.7.39 కోట్లు, అప్పులు రూ.2.54 కోట్లు
[ 23-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతోపాటుగా ఇతని భార్య రమణమ్మకు రూ.7.39 కోట్లు ఆస్తులు ఉండగా, అప్పులు రూ. 2.54 కోట్లు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి