గుండెకు సుస్తీ..!
కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్) కార్డియో థొరాసిక్ విభాగంలో గుండె శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) నిలిచిపోయాయి. రెండున్నర నెలల నుంచి ఈ పరిస్థితి నెలకొంది.
పెద్దాసుపత్రిలో నిలిచిన శస్త్రచికిత్సలు
పేద రోగులపై ఆర్థిక భారం
వన్టౌన్, న్యూస్టుడే
శస్త్రచికిత్స విభాగం
కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్) కార్డియో థొరాసిక్ విభాగంలో గుండె శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) నిలిచిపోయాయి. రెండున్నర నెలల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఊపిరితిత్తులు, థొరాసిక్కు సంబంధించిన తేలికపాటి చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. నిపుణులైన ఇద్దరు వైద్యాధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్న పరికరం లేకపోవడంతో కీలక శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారు. దీంతో పేద రోగులు ప్రాణాలను కాపాడుకోవడానికి కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రూ.లక్షలు అప్పు చేసి చికిత్స పొందుతున్నారు.
* కేజీహెచ్లో గత కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా బైపాస్, ఓపెన్హార్ట్ సర్జరీలు చేసేవారు. నెలకు 15 నుంచి 20 మంది ఆయా చికిత్సలు జరిగేవి. శస్త్రచికిత్స వైద్య నిపుణులు ఉండడంతోపాటు, ఆపరేషన్లకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, అనువైన థియేటరు, ఆపరేషన్ తర్వాత రోగి కోలుకోవడానికి అవసరమైన ఐసీయూ విభాగం అందుబాటులో ఉన్నాయి. దీంతో గుండె శస్త్రచికిత్సలను నిరంతరాయంగా చేసేవారు. రెండున్నర నెలల క్రితం కీలకమైన హార్ట్లంగ్ వైద్య పరికరం మరమ్మతులకు గురైంది. రూ.20లక్షల విలువ చేసే ఈ యంత్రం గుండె శస్త్రచికిత్సలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఏమిటీ హార్ట్ లంగ్ యంత్రం..
* ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే సమయంలో గుండె పనిచేయదు. ప్రత్యామ్నాయంగా హార్ట్లంగ్ యంత్రం ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్తో కూడిన రక్తం సరఫరా అయ్యేలా చేస్తారు. అంటే గుండె, ఊపిరితిత్తులు చేయాల్సిన పని ఈ వైద్య పరికరం చేస్తుంది. దీన్నే కార్డియో పల్మనరీ బైపాస్ పంప్ అని కూడా పిలుస్తారు. ఆరేడేళ్ల కిందట కొనుగోలు చేసిన యంత్రాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. సరైన నిర్వహణ లేకపోవడం, యంత్రం చెడిపోయిన వెంటనే మరమ్మతులు చేసే టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో పునరుద్ధరణకు నోచుకోలేదు. అలాగని కొత్త యంత్రం కొనుగోలు చేసే ప్రతిపాదన కూడా చేయలేదు.
* ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున సీఎస్ఆర్ నిధులు రూ.6 కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రిలో రోగులు, సహాయకులకు పలు వసతులు కల్పించారు. హార్ట్ లంగ్ వైద్య పరికరం విషయంలో మాత్రం ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైద్యాధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లలేదని సమాచారం. డీఎంఈకి తెలుపగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నుంచి సరైన స్పందన రాలేదు.
ప్రయివేటులో రూ.లక్షల్లో ఖర్చు
* ఇటీవల కాలంలో పలువురు గుండె జబ్బుల బాధితులకు కేజీహెచ్లో యాంజియోగ్రామ్ చేస్తున్నారు. అవసరమైన వారికి స్టంట్లు కూడా వేస్తున్నారు. బైపాస్ సర్జరీ వంటి శస్త్రచికిత్సలకు మాత్రం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. ప్రయివేటులో ఇలాంటి చికిత్సలకు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆర్థిక స్థోమత ఉన్నవారు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు పెద్దగా ఇబ్బంది ఉండడం లేదు. ఆరోగ్యశ్రీ లేని పేదలు ప్రయివేటులో వైద్యం చేయించుకోలేక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా కొత్త హార్ట్లంగ్ యంత్రం సమకూర్చి గుండె ఆపరేషన్లను పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..